MIDHANIలో ఖాళీ పోస్టులు.. బిటెక్ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..

హైదరాబాద్​లోని మిశ్రమ ధాతు లిమిటెడ్ (MIDHANI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.


పోస్టుల సంఖ్య: 23

పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ (మెటలర్జీ) 08, అసిస్టెంట్ ఇంజినీర్ (మెకానికల్) 08, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) 01, అసిస్టెంట్ మేనేజర్ (రీఫ్యాక్టరీ మెయింటెనెన్స్) 01, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ – నెట్​వర్క్ అడ్మినిస్ట్రేటర్) 01, అసిస్టెంట్ మేనేజర్ (మెటీరియల్స్ మేనేజ్​మెంట్) 04.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు.

అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 10.

లాస్ట్ డేట్: అక్టోబర్ 10.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు midhani-india.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.