షుగర్ కంట్రోల్ అవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. పైగా డయాబెటిస్ వచ్చిన తరవాత పూర్తిగా తగ్గించుకోవడం కష్టం.
కేవలం లక్షణాలను మాత్రమే కంట్రోల్ చేసుకోడానికి వీలవుతుంది. అయితే..ఈ సింప్టమ్స్ తగ్గిపోవాలంటే మందులు వాడాల్సిందే. అలా కాకుండా కొన్ని పదార్థాలు వాడడం ద్వారా సులువుగానే షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చని డాక్టర్ నీల్ వివరించారు. మరి ఈ మూడు పదార్థాలు ఏంటి, ఎలా వాడాలో తెలుసుకుందాం.
డయాబెటిస్ వచ్చిందంటే దాంతో పాటు ఎన్నో సమస్యలు ముంచుకొస్తాయి. విపరీతమైన నీరసం, ఎప్పుడూ నిద్ర వస్తున్నట్టుగా ఉండడం, అనారోగ్యకరమైన ఆకలి..ఇలా ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. ఈ సింప్టమ్స్ తగ్గించుకోడానికే రకరకాల మందులు వాడాల్సి వస్తుంది. వాడుతున్నారు సరే. మరి ఎంత కాలం ఇలా పూర్తిగా మెడిసిన్ పైనే ఆధారపడతారు. ఈ ప్రశ్నకే సమాధానం చెప్పారు డాక్టర్ నీల్. అటు మెడిసిన్ వాడుతున్నప్పటికీ కొన్ని చిట్కాలతో చాలా త్వరగా షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు అని వివరించారు. ముఖ్యంగా మూడు పదార్థాలు ఎప్పుడూ మీ వెంట ఉంచుకుంటే షుగర్ తగ్గించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ మూడు పదార్థాలు ఏంటి. వీటి వల్ల షుగర్ ఎలా కంట్రోల్ అవుతుంది. అసలు వీటిని ఎలా వాడాలి అనే వివరాలు తెలుసుకుందాం. డయాబెటిస్
చేరుకుంటుంది. అతిగా దాహం వేస్తుంది. దీంతో పాటు అతిగా మూత్ర విసర్జన చేస్తుంటారు. ఇక ఉన్నట్టుండి బరవు తగ్గిపోవడం, కొన్ని సార్లు కంటి చూపు మందగించడం లాంటి లక్షణాలు కూడా కనబడతాయి. ఎప్పుడూ అలసటగా కనిపిస్తారు. ఎప్పుడైనా పొరపాటున గాయాలు అయితే..అవి మానడానికి చాలా సమయం పడుతుంది.
ఏం చేయాలి
తప్పనిసరిగా చేయాల్సిన పని ఏంటంటే..వ్యాయామం చేయడం. ఎక్సర్ సైజ్ లు చేస్తేనే త్వరగా మార్పులు చూడగలరు. వీటన్నింటితో పాటు ఇప్పుడు చెప్పే మూడు పదార్థాలు మీ వద్ద ఉంచుకుంటే షుగర్ వేగంగా కంట్రోల్ అవుతుంది.
దాల్చిన చెక్క
ఎక్కువగా ఉంటాయి. జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అంతే కాదు. బరువు తగ్గడంలో ఇది తోడ్పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల గుండె భద్రంగా ఉంటుంది. ఇదే సమయంలో చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన పదార్థాలలో ఇది కూడా ఒకటి అని చెబుతున్నారు డాక్టర్ నీల్. అందుకు కారణం ఏంటంటే…దాల్చిన చెక్కను తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. లిపిడ్ ప్రొఫైల్ కూడా మెరుగవుతుంది. అయితే..సాధారణంగా భోజనం చేసిన తరవాత రక్తంలోకి గ్లూకోజ్ ఎక్కువగా విడుదలవుతుంది. అప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలా ఈ లెవెల్స్ పెరగకుండా షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే దాల్చిన చెక్కతినాలి. ఉదయమే టిఫిన్ చేసిన తరవాత దాల్చిన చెక్క తినడం ద్వారా డయాబెటిస్ కంట్రోల్ అవుతుందని డాక్టర్ నీల్ వివరించారు.
దాల్చిన చెక్క లాగానే యాలకులు కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. ఇదే సమయంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. వీటి వల్ల గుండె భద్రంగా ఉంటుంది. యాలకులతో జీర్ణ శక్తి మెరుగవుతుంది. చాలా మంది యాలకులను మౌత్ ఫ్రెషనర్ గా వాడుతుంటారు. నోటి దుర్వాసన సమస్య ఉన్న వారు క్రమం తప్పకుండా యాలకులు తింటే క్రమంగా ఈ సమస్య దూరమవుతుంది. యాలకులు కేవలం వంటకు రుచి ఇవ్వడమే కాదు. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. పొట్టలో జీర్ణ ప్రక్రియకు అవసరమైన ఎంజైమ్స్ ని విడుదల చేస్తాయి. పొట్టలో ఉబ్బరం, గ్యాస్, మంట వంటి వాటిని దూరం చేస్తాయి. ఆయుర్వేదలో యాలకులను హృదయ అని పిలుస్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తరవాత ఒకటి లేదా రెండు యాలకులను తినడం ఎంతో ఆరోగ్యకరం. వీటిని తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. తద్వారా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
లవంగాలు
యాలకులతో పాటు లవంగాలను కూడా మౌత్ ఫ్రెషనర్ గా చాలా మంది వాడుతుంటారు. పంటి నొప్పి నివారణ నుంచి శ్వాస కోశ సమస్యలను తగ్గించడం వరకూ అన్ని విధాలుగా లవంగాలను వాడుతుంటారు. వంటల్లోనూ సుగంధ ద్రవ్యంలా వినియోగిస్తారు. సూప్స్, కూరల్లో ఎక్కువగా వాడతారు. గొంతు నొప్పి నుంచి రిలీఫ్ పొందడానికి లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి. లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ని బయటకు పంపుతాయి. రాత్రి భోజనం చేసిన తరవాత ఒకటి లేదా రెండు లవంగాలు తినాలని సూచిస్తున్నారు డాక్టర్ నీల్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించడంతో పాటు అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్స్ లో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడంలోనూ సాయపడుతుంది.
గమనిక
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.
































