పుట్టిన ప్రతీజీవి మరణించక తప్పదు, మరణించిన ప్రతి జీవి పుట్టక తప్పదు అనేది నానుడి. ఇది అందరికీ తెలిసిందే. కానీ అందరి మదిలో మెదిలేది ఒకే ఆలోచన?
అది ఏమిటంటే? అసలు మరణించడానికి ముందు వ్యక్తి మనసులో కదిలే భావాలు ఏంటీ. వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు. కాగా, దాని గురించే ఇప్పుడు శాస్త్ర వేత్తలు ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిపారు. అది ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మరణానికి కొన్ని క్షణాల ముందు మానవుడి మెదడులో ఏం జరుగుతుంది అనే రహస్యాన్ని ఇటీవలన ఓ అధ్యయనంలో శాస్త్రవేత్తలు తెలుసుకో గలిగారు. కాగా, ఇప్పుడు మనం ఒక వ్యక్తి మరణానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆయన మదిలో కలిగే ఆలోచనలు, అతను ఏం ఆలోచిస్తాడో చూద్దాం.
పరిశోధకులు ఒక మూర్చ రోగిని ఎలక్ట్రోఎన్స్ ఫలో గ్రామ్ రికార్డింగ్ ద్వారా పరీక్షించగా, ఆ సమయంలో అతనికి గుండెపోటు వచ్చిందంట. అయితే ఆయన చనిపోవడానికి 15 నిమిషాల ముందు అతడి ఏం ఆలోచించాడు, అతని మెదడులో మెదిలిన ఆలోచనలు ఈజీజీ రికార్డ్ చేసిందంట. గామా డోలనాలు అని పిలవబడే నిర్ధిష్ట మెదడు తరంగ నమూనాను అది వెళ్లడించిందంట.
దీని గురించి పరిశోధకులు మాట్లాడుతూ.. ఒక వ్యక్తి చనిపోవడానికి ముందు అతని మెదడు వెయ్యిరేట్లు చాలా యాక్టివ్గా పని చేసింది. ముఖ్యంగా గుర్తుకు తెచ్చుకోవడం, కలలు, అన్ని చాలా త్వరగా జరిగిపోయాయి. ముఖ్యంగా వ్యక్తి చనిపోయే కొన్ని క్షణాల ముందు అతని తన చివరి క్షణాల్లో ఆనందకరమైన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నట్లు తెలిపారు.
డాక్టర్ అజ్మల్ జెమ్మార్ ప్రకారం.. వ్యక్తి చనిపోయే ముందు, దాని చివరి క్షణాలు చాలా ఎక్కువ వేగంతో పని చేసి, ఆనందకరమైన జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది. అది చూసి మేమే షాక్ అయ్యాం అని తెలిపారు. మంచి జ్ఞాపకాలను మాత్రమే అది గుర్తు తెస్తాయంట.
































