బాలీవుడ్‌ హీమ్యాన్‌ ధర్మేంద్ర (89) కన్నమూత

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్ను మూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు కన్నుమూశారు. బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో ధర్మేంద్ర తుదిశ్వాస.


షోలే, ఫూల్‌ ఔర్‌ పత్తర్‌, చుప్కే చుప్కే వంటి..బ్లాక్ బస్టర్‌ ల్లో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ధర్మేంద్ర. ధర్మేంద్ర మృతికి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

89ఏళ్ల ధర్మేంద్ర మరణవార్త విని బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర ఇద్దరు భార్యలు ప్రకాశ్ కౌర్, హేమమాలిని. బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్ తొలి భార్య సంతానం. అత్యంత ప్రాచుర్యం పొందిన ‘షోలే’లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ తో ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అలాగే అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.