కేంద్ర ప్రాథమిక విద్యా మండలి (CBSE) ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS)లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పోస్టుల భర్తీకి ఇవాళ సీబీఎస్ఈ షార్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఈ రిక్రూట్మెంట్ కింద మొత్తం 12,799 పోస్టులు (KVSలో 9,156, NVSలో 3,643) భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), ప్రైమరీ టీచర్స్ (PRT), లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్ వంటి టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉన్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగం సంపాదించాలనే అభ్యర్థులకు ఇది గొప్ప సువర్ణాకాశం. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను నవంబర్ 14 నుంచి డిసెంబర్ 4 వరకు సమర్పించవచ్చు. ఇక పరీక్షలను 2026 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నిర్వహించే అవకాశం ఉంది. అప్లికేషన్ ఫీజు జనరల్/OBCకి రూ.1,000-1,500 (పోస్ట్పై ఆధారంగా), SC/ST/PWDకి మినహాయింపు ఇవ్వనున్నారు. ఫీజు చెల్లింపులను ఆన్లైన్లోనే చేయాలని అధికారులు సూచించారు.
































