మనం సంతోషంగా జీవించడానికి మన పూర్వీకులు మనకు అందించిన అతి పెద్ద వరం వాస్తు శాస్త్రం. ఇంటి నిర్మాణంలో కచ్చితంగా వాస్తును ఉపయోగిస్తాం. ఇల్లేకాదు..
ఇతర కట్టడాలకు కూడా వాస్తు ముఖ్యం. ప్రతికూల శక్తిని పారద్రోలి, సానుకూల శక్తిని పెంపొందించాలంటే ఇంటికి వాస్తు సరిగ్గా ఉండాలి. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి కొన్ని గుర్తులు ఉంటే బాగా కలిసివస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి సరైన దిశలో ఉండాలి. వాటికి సంబంధించిన ముఖ్య విషయాలను తెలుసుకుందాం.
ఇంటి ప్రధాన ద్వారాలమీద ఓంకారం ఉండాలి.
దీనివల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.
ప్రతి ఒక్కరు తలుపుమీద ఓంకారం ఉండేలా చూసుకోవాలి.
పంచ శూల కూడా తలుపుమీద వేసుకోవచ్చు.
దీనివల్ల సంతోషం, సుఖం కలుగుతాయి.
కుటుంబంలో అందరూ ప్రశాంతంగా ఉంటారు.
మరో ప్రధానమైన గుర్తు స్వస్తిక్.
ఈ గుర్తు ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది.
వాస్తు దోషాలన్నింటినీ తొలగిస్తుంది.
ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు.
ప్రధాన ద్వారం మీద కమలం పువ్వు ఉంటే చాలా మంచిది.
సిరి సంపదలకు లోటు ఉండదు.
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడొచ్చు.
త్రిశూలం గుర్తు వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది.
ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా నివారిస్తుంది.
కలశం గుర్తు కూడా చాలా మంచిది.
కలశం విష్ణువును వరుణ దేవుడిని సూచిస్తుంది.
కలశంపై కొబ్బరికాయ గుర్తు కూడా పెట్టొచ్చు.
కొబ్బరికాయ లక్ష్మీదేవికి చిహ్నం.



































