మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా కొద్ది రోజుల క్రితం ఓ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ చిత్ర టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో పలు పేర్లు ప్రచారం అయ్యాయి. వాటి అన్నింటిని పటా పంచలు చేస్తూ తాజాగా ఈ చిత్ర టైటిల్ను ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
ఈ పోస్టర్లో వెంకటేష్ బ్యాగ్ పట్టుకుని నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఇక ఈ టైటిల్ లోనే హౌస్ నెం 47, ఏకే 47 అంటూ కూడా హైలెట్ చేయడం గమనార్హం. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చెప్పేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
శ్రీనిధి శెట్టి కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో వెంకీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో (Venkatesh-Trivikram) వచ్చిన ‘మల్లీశ్వరీ’, ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలు ఘన విజయాలను సాధించడంతో తాజా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.


































