జిల్లా సరిహద్దుల మార్పు..సచివాలయాల పేర్లు మారుస్తూ నిర్ణయం

జిల్లాల సరిహద్దుల మార్పులతో పాటుగా గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది.


ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణే లక్ష్యంగా పలు చారిత్రాత్మక తీర్మానాలు చేసినట్లు వారు పేర్కొన్నారు.

మంత్రివర్గ నిర్ణయాల ముఖ్యాంశాలు 28 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్: పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని జిల్లాల సంఖ్యను 28కి పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా మదనపల్లి, రంపచోడవరం, మార్కాపురం ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించారు.అన్నమయ్య జిల్లా పునర్వ్యవస్థీకరణ: అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై కీలక చర్చ జరిగింది. రాయచోటిని తిరిగి కడప జిల్లాలో కలపాలని, రాజంపేట వాసుల విన్నపం మేరకు జిల్లా కేంద్రంపై తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతికి మహర్దశ: ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులతో అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగులకు డీఏ పెంపు: ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఏ (DA) పెంపు అమలుకు ఆర్థిక శాఖకు అనుమతి ఇచ్చారు. తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సచివాలయాల పేర్ల మార్పు: గ్రామ, వార్డు సచివాలయాల పేర్ల మార్పునకు సంబంధించి ఆర్డినెన్స్‌ను కేబినెట్ ఆమోదించింది. వైద్య, ఆరోగ్య రంగానికి ఊతం: రాష్ట్రంలో పబ్లిక్ హెల్త్ యూనిట్ల బలోపేతానికి, అలాగే నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని సాంకేతిక విభజన అంశాలకు మద్దతు తెలిపారు. ప్రజల కోసమే ఈ నిర్ణయాలు – మంత్రులుగత ప్రభుత్వం అశాస్త్రీయంగా చేసిన జిల్లాల విభజన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకే ఈ మార్పులు చేస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. 2025 ముగింపు దశలో ఈ నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.