సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్

స్టార్ హీరో అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


‘ఏఏ-23’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఊహకందని స్థాయికి వెళ్ళిపోయాయి. ఇంకా షూటింగ్ కూడా మొదలవ్వకముందే, కేవలం ఒక చిన్న అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ సినిమా ప్రకటన కోసం విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 3.55 మిలియన్లకు (35 లక్షలకు) పైగా వ్యూస్ వచ్చాయి. ఇండియాలో ఒక సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోకు ఈ స్థాయిలో సోషల్ మీడియాలో వ్యూస్ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఆ మ్యూజిక్ వింటుంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తుండటంతో, ప్రతి ఒక్కరూ ఆ ఆడియోను వాడుతూ రీల్స్ చేసేస్తున్నారు. ఈ అరుదైన ఘనతను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.