హీరో ఆయనే, హీరోయిన్ కూడా ఆయనే! ఇండియాలో మొట్టమొదటి డబుల్ యాక్షన్ మూవీ…

www.mannamweb.com


టెక్నాలజీ పెరిగిన తర్వాత డబుల్ యాక్షన్ ఏంటి? ఒకే సారి తెర మీద 10 మందిగా కనిపించడం కూడా తేలికైం పోయింది. ‘దశావతారం’ సినిమాలో కమల్ హాసన్ పది అవతరాల్లో కనిపించాడు.
ఒకే సీన్‌లో డబుల్ రోల్ ఏంటి, నాలుగు పాత్రల్లో తానే కనిపించి ఆశ్చర్యపరిచాడు. అయితే ఇండియాలో డబుల్ యాక్షన్ చేసిన మొట్టమొదటి నటుడు ఎవరో తెలుసా..

అన్నా హరి సాలుంకే… దాదా సాహెబ్ పాల్కే దర్శకత్వంలో వచ్చిన ‘హరిశ్చంద్ర’, ‘రాజా హరిశ్చంద్ర’ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసిన నటుడు అన్నా హరి సాలుంకే.. 1922లో రామాయణాన్ని ఆధారంగా తీసుకుని ‘లంకా దహన్’ మూవీని తెరకెక్కించాడు దాదా సాహెబ్ పాల్కే.. ఈ మూవీలో హరి సాలుంకే అటు రాముడిగా, ఇటు సీతా దేవిగా రెండు పాత్రల్లోనూ నటించాడు..

భారత చలన చిత్ర చరిత్రలో డబుల్ రోల్ పోషించిన మొట్టమొదటి నటుడిగా చరిత్ర లిఖించాడు హరి సాలుంకే.. రావణాసుడు, సీతా దేవిని అపహరించడం, హనుమంతుడు లంకను చేరి, సీతమ్మకి రాములవారి ఉంగరాన్ని ఇవ్వడం, ఆ తర్వాత కోపంతో లంకా దహనం చేయడం వంటి సన్నివేశాలు ‘లంకా దహన్’ మూవీలో ఉంటాయి. ఈ మూవీలో రాముడు, సీత ఎదురెదురుగా ఒకే ఫ్రేమ్‌లో ఉండే సన్నివేశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో హరి సోలంకి, సీతగా, శ్రీరాముడిగా చేశాడనే విషయాన్ని జనాలు చాలా రోజుల వరకూ గుర్తించలేకపోయారు..

అన్నా హరి సోలంకి, సినిమాటోగ్రాఫర్ కూడా.. ‘లంకా దహన్’ మూవీ తర్వాత ‘సత్యనారాయణ్’, ‘బుద్దా దేవ్’ వంటి సినిమాల్లో కూడా ఫీమేల్ క్యారెక్టర్లు పోషించాడు హరి సోలంకి.. ఆ తర్వాత మహిళా నటులు, సినిమాల్లోకి రావడం పెరగడంతో హరి సోలంకికి స్త్రీ వేషాలు వేయాల్సిన అవసరం రాలేదు. 1931లో ‘ఆమీర్ ఖాన్’ అనే సినిమాలో చివరిగా నటించిన హరి సోలంకి, ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకున్నారు..
భారత చలన చిత్ర పరిశ్రమకు ఎంతో సేవలు చేసిన అన్నా సోలంకి, ఎక్కడ పుట్టారు? సినిమాలు మానేసిన తర్వాత ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు చనిపోయారు? అసలు చనిపోయారా? ఇంకా బతికే ఉన్నారా? అనే విషయాలు ఎవ్వరికీ తెలియకపోవడం విశేషం..