కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్..!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 50 శాతానికి పెరిగింది. ఇది జనవరి 1, 2024 నుండి అమల్లోకి వచ్చింది. పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్ ఏప్రిల్‌ నుంచి చెల్లించనుంది. కానీ, డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ పెంపు)తో పాటు ఇతర అలవెన్సులు కూడా పెరిగాయి. ఈ అలవెన్సుల్లో అతిపెద్ద మార్పు ఇంటి అద్దె అలవెన్స్ (HRA)లో వచ్చింది.కరువు భత్యం 50శాతం దాటడంతో, హెచ్ఆర్ఏ కూడా సవరించింది. ప్రభుత్వం జనవరి 2024 నుండి డియర్‌నెస్ అలవెన్స్‌ను 50 శాతానికి పెంచింది. డీఏ 50 శాతం దాటిన వెంటనే, హెచ్‌ఆర్‌ఏ కూడా సవరించబడింది. పెరిగిన HRA రేట్లు ఇప్పుడు 30%, 20% మరియు 10%. ఉద్యోగులకు ఏప్రిల్ నుండి దాని ప్రయోజనాలను పొందడం ప్రారంభమవుతుంది.


డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్- డిఓపిటి ప్రకారం, డియర్‌నెస్ అలవెన్స్ ఆధారంగా కేంద్ర ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఎ)లో సవరణ జరిగింది. ఉద్యోగులందరూ పెరిగిన హెచ్‌ఆర్‌ఏ ప్రయోజనం పొందుతారు. నగర కేటగిరీ ప్రకారం 30 శాతం, 20 శాతం, 10 శాతం చొప్పున హెచ్‌ఆర్‌ఏ ఇస్తున్నారు. డీఏతో పాటు ఈ పెంపుదల జనవరి 1, 2024 నుంచి అమలులోకి వచ్చింది. 2016లో జారీ చేసిన మెమోరాండంలో ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ పెంచుతూ డీఏను ఎప్పటికప్పుడు సవరిస్తామని పేర్కొంది.

ఇంటి అద్దె అలవెన్స్‌లో అత్యధిక సవరణ 3శాతం. గరిష్ఠ రేటు 27 శాతం కాగా, దానిని 30 శాతానికి పెంచారు. మెమోరాండం ప్రకారం, డీఏ 50శాతం దాటితే హెచ్‌ఆర్‌ఏను 30శాతం, 20శాతం 10శాతం రివిజన్ చేయడానికి నిబంధన ఉంది. X, Y, Z క్లాస్ సిటీల ప్రకారం ఇంటి అద్దె అలవెన్స్ (HRA) కేటగిరీలు ఉంటాయి. ఎక్స్ కేటగిరీలో ఉన్న కేంద్ర ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ లభిస్తుంది. అదే సమయంలో, వై క్లాస్ ప్రజలకు ఇది 20 శాతంగా మారింది. జెడ్ క్లాస్ వారికి 9 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది.