AP Mega Job Mela 2025: ఉద్యోగ అవకాశాలు! 10వ తరగతి, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, PG పాస్ అయినవారికి జాబ్ గ్యారెంటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు “AP మెగా జాబ్ మేళా 2025” నిర్వహించనుంది. మే 3, 2025న నిడదవోలులోని ఎస్.వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ జాబ్ మేళా జరుగుతుంది. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ పాస్ అయినవారికి 1,302 ఖాళీలను భర్తీ చేయడానికి 45 ప్రైవేట్ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. జీతం ₹12,000 నుండి ₹40,000 వరకు ఉంటుంది.


పాల్గొనే కంపెనీలలో ఇసూజూ, ఎల్ & టీ కన్స్ట్రక్షన్, పానాసోనిక్, హెచ్డీఎఫ్సీ, అపోలో ఫార్మసీ, డెక్కన్ ఫైన్ కెమికల్స్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న 35 సంవత్సరాల లోపు యువత తమ బయోడేటా, విద్యా సర్టిఫికెట్లు, ఐడి ప్రూఫ్‌లు తీసుకుని మే 3రో ఉదయం 9 గంటలకు నిడదవోలులో హాజరు కావాలని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అభ్యర్థన చేశారు.

ఈ మెగా జాబ్ మేళా ద్వారా నిరుద్యోగితను తగ్గించడం, యువతకు స్థిరమైన ఆదాయ వనరులను కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని, అభ్యర్థులు తమ భవిష్యత్తును ప్రకాశవంతం చేసుకోవాలని మంత్రి గారు సూచించారు.