ఇటీవల దేశంలో సార్వత్రిక ఎన్నికలు-2024 విజయవంతంగా ముగిశాయి. ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించారు.
ఈ నేపథ్యంలో, సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక నెల గౌరవ వేతనం ప్రకటించింది. ఒక నెల గరిష్ఠ వేతనానికి సమానంగా గౌరవ వేతనం చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా జిల్లాల కలెక్టర్లకు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
![](https://i0.wp.com/mannamweb.com/wp-content/uploads/2024/06/b3566b777ff280ae7d67e2ede7598947d155d7a9f0b23492407bf92a04832dca.webp?resize=360%2C420&ssl=1)