AP Pensions: ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. శుక్రవారం వరకు డీబీటీ ద్వారా పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం.. అయితే, గత నెల సచివాలయాల దగ్గర పడిగాపులు కాసిన వృద్ధులు.. ఇప్పుడు తమ ఖాతాల్లో పడిన సొమ్ము తీసుకోవడానికి బ్యాంకుల దగ్గర క్యూలు కడుతున్నారు.. బ్యాంకులు ఓపెన్ చేయకముందే.. ఉదయం 9 గంటల నుంచే వాటి ముందు క్యూలు కడుతున్నారు.. అయితే, డీబీటీ ద్వారా డబ్బులు జమ కానివారికి ఇవాళ్టి నుంచి ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..
పెన్షన్ల పంపిణీ కొరకు ఈ నెల 1,945.39 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. మొత్తం ఏపీలో పెన్షనర్ల సంఖ్య 65,49,864గా ఉందని.. మూడు రోజుల్లో 64,13,200 మందికి అంటే 97.91 శాతం లబ్ధిదారులకు పెన్షన్లు అందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. మరోవైపు.. మొత్తం 16,57,361 మందిలో 15,95,482 (96.27 శాతం) మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించింది ఏపీ ప్రభుత్వం.. 48,92,503 మందిలో 48,17,718 (98.47 శాతం) మందికి డీబీటీ ద్వారా పెన్షన్లు అందించినట్టు పేర్కొంది.. 74,399 మంది బ్యాంకు ఖాతాలు పని చేయకపోవడంతో పెన్షన్ అందలేదని స్పష్టం చేసింది.. పెన్షన్ అందని 74,399 మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాలని ఏపీ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.. ఈ రోజు, రేపు 74,399 మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కాని వారికి ఈ నెల 4న (శనివారం) గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. దీనిపై ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Related News
ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా సీఎం జగన్ , మంత్రి విడుదల రజనీ (Vidadala Rajini) పేరుతో ఐవీఆర్ఎస్ ఫోన్లు వచ్చాయి. అయితే ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల క...
Continue reading
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల అధికారులకు చిక్కకుండా సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నియో...
Continue reading
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేళ.. పలు పాత స్కీమ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా నగదు జమ చేయాల్సిన వ్యవహారం ఇప్పుడు కాకరేపుతోంది.. అయితే,...
Continue reading
కడపలో అవినాష్ రెడ్డి పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది. కడపలో వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించేవారు ఎవరూ ఆ కుటుంబానికి ఓటేసే అవకాశం లేదు. వైఎస్ కుటుంబాన్ని అభిమానించేవారు మాత్రం ఈ సార...
Continue reading
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి చివరి దశకు చేరుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు నువ్వా నేనా అన్న చందంగా ప్రచారాల్లో మునిగిపోయారు. గెలుపు పై ఎవరి ధీమా వారు వ్యక్త...
Continue reading
ఏపీ రాజకీయాల్లో ఈసీ నిర్ణయాలు సంచలనంగా మారాయి. మే 13న ఎన్నికలు జరగనుండటంతో ఓటింగ్ ప్రక్రియ నిర్వహణను ముమ్మరం చేసింది. అటు ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేస్తోంది. ప్రధానంగా నేతల ప...
Continue reading
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్ర...
Continue reading
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జనసైనికులపై వైకాపా వర్గీయులు ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. సినీ హీరో సాయి ధరమ్తేజ్ కాన్వాయ్ ముందుకు వెళుతున్న తరుణంలో గుర్తుతెల...
Continue reading
ఆసరా పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన ప్రకటన చేసింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో మే 1వ తేదీ నుండి 5 తేదీ వరకు పెన్షన్లు జమ చేస్తామని వెల్లడించింది.
కాగా, ఎలక్షన్ కోడ్ ...
Continue reading
అమరావతి ఎన్ఐడీకి రక్షిత నీరివ్వలేని దుస్థితి
అనారోగ్యంతో పలువురు ఆస్పత్రిపాలు
జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థులు
ఆగమేఘాలపై ప్రిన్సిపల్ సెక్రటరీని పంపిన వైనం
రాష్ట...
Continue reading
ఇటీవల రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలు బదిలీ అయిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం వారిని బదిలీ చేసింది. అ...
Continue reading
శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో ఎలుగుబంట్లు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పట్ట పగలు గ్రామాల్లోకి చొరపడుతూ స్వైర విహారం చేస్తున్నాయి.
బుధవారం మధ్యాహ్నం వజ్రపు కొత్తూరు మండల...
Continue reading