APPSC గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్ విడుదల.. ఇంటర్వ్యూలు ఎప్పుడు?

 గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) మంగళవారం (జూన్‌ 10) విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్‌లిస్ట్‌ను అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది..

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) మంగళవారం (జూన్‌ 10) విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్‌లిస్ట్‌ను అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 1 : 2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. కాగా గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలను మే 3 నుంచి 9వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జరిగిన కేవలం నెలరోజుల్లోనే ఏపీపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.


ఏపీపీఎస్సీ మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్‌ ప్రిలిమ్స్ పరీక్షను అదే ఏడాది మార్చి 17వ తేదీన నిర్వహించింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 91,463 మంది అంటే దాదాపు 72.55 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో మెయిన్స్ పరీక్షకు 4,496 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరందరికీ ఈ ఏడాది మే 3 నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలు జరిపారు. తాజాగా విడుదలైన గ్రూప్‌ 1 మెయిన్స్ ఫలితాల్లో 182 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.