APPSC Group-2 Prelims Exam 2024 : అభ్యర్థులకు అలర్ట్‌.. గ్రూప్‌-2 పరీక్షపై కీలక ప్రకటన..

ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీపీఎస్సీ పూర్తి చేశారు. అయితే.. ఇదే రోజు ఎస్‌బీఎస్ క్లర్క్ పరీక్ష కూడా ఉంది. ఈ నేపథ్యంలో APPSC కీలక ప్రకటన చేసింది.
ఎస్‌బీఎస్ క్లర్క్ పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీ ఉందని.. పలువురు మాకు వినతి పత్రం సమర్పించారు. ఇంకా ఎవరైన ఈ రెండు పరీక్షలు రాస్తున్నవారు ఉంటే.. హాల్‌టికెట్ల కాపీతో ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి 12:00లోపు appschelpdesk@gmail.com కి మెయిల్ చేయండి. వారికి క్లర్క్ పరీక్షను మార్చి 4వ తేదీన నిర్వహించాలని ఎస్‌బీఐని కోరుతాం అని పేర్కొంది.


గ్రూప్‌-2లో ఒక్కొక్క ఉద్యోగానికి 537 మంది పోటీ..
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2కు దాదాపు 4,83,525 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 537 మంది పోటీపడుతున్నారు. మెయిన్స్ పరీక్ష కోసం APPSC గ్రూప్-2 పరీక్ష 2024 ప్రిలిమ్స్‌లో 1:50 ఎంపిక నిష్పత్తి ఉంటుందని APPSC సభ్యుడు, పరిగె సుధీర్ ట్వీట్ చేశారు. దాదాపు 45 వేల మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

గ్రూప్‌-2 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు..