- Like
- Digg
- Del
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- Yummly
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Skype
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల విషయంలో వివాదం నడుస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టింది.
ఇందులో భాగంగా సీనియర్ అధికారి ఈఎన్సీ మురళీధర్ రావును ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని ఆదేశించారు. మరో వైపు రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ చార్జ్ వెంకటేశ్వరరావును సర్వీస్ నుండి తొలగించారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక, కేఆర్ఎంబీ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుంది. మరికొందరు ఇంజనీర్లపైన ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనున్న వేళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున ప్రక్షాళన చేపట్టడం హాట్ టాపిక్గా మారింది.