Tata Group విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక ఆఫర్ను ప్రారంభించింది. ఈ ఆఫర్లో, మీరు కేవలం రూ. 1,535కే ఎక్స్ప్రెస్ వాల్యూ ఛార్జీతో ప్రయాణించవచ్చు.
చెక్-ఇన్ బ్యాగులు లేని వారికి, ఎక్స్ప్రెస్ లైట్ ధర రూ.1,385 నుండి ప్రారంభమవుతుంది. ఈ అద్భుతమైన ఆఫర్ ను ఎయిర్ ఇండియా ‘పేడే సేల్’ పేరుతో తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు తక్కువ ధరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ వెబ్ సైట్లో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు మార్చి 2, 2025 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మీరు 19 సెప్టెంబర్ 2025 వరకు ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే వినియోగించుకోండి. ఈ ఆఫర్ గురించిన పూర్తి విరాలు తెలుసుకోండి.
ఎక్ట్స్ ట్రా చార్జెస్ లేవు..
ఈ ప్రత్యేక ఆఫర్ కింద, ప్రయాణీకులు ఎక్స్ప్రెస్ లైట్ ఛార్జీలో అనేక గొప్ప ప్రయోజనాలను పొందొచ్చు. బుకింగ్ కోసం మీరు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనితో పాటు, మీరు 3 కిలోల అదనపు క్యాబిన్ బ్యాగేజీని కూడా ఉచితంగా తీసుకెళ్లొచ్చు. చెక్-ఇన్ బ్యాగేజీ ధరలు కూడా తక్కువే. దేశీయ విమానాల్లో 15 కిలోల లగేజీ కేవలం 1,000 రూపాయలకే అందుబాటులో ఉంటుంది.
వారికి అదనపు ప్రయోజనాలు..
దీనితో పాటు, టాటా న్యూపాస్ సభ్యులు ఈ ఆఫర్ నుండి ప్రయోజనాలను పొందుతారు. వారు బిజినెస్ క్లాస్ సీట్ అప్గ్రేడ్లపై ప్రత్యేక తగ్గింపులు, గౌర్మైర్ హాట్ మీల్స్, సీట్ సెలక్షన్ , ఎక్స్ప్రెస్ అహెడ్ ప్రాధాన్యతా సేవపై 25శాతం వరకు తగ్గింపును కూడా పొందుతారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తన కొత్త 33 బోయింగ్ 737-8 విమానంలో బిజినెస్ క్లాస్ సీట్లను కూడా అందిస్తోంది.
డిస్కౌంట్ ఆఫర్స్..
దీనితో పాటు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సిబ్బంది మరియు వారి కుటుంబాలకు ప్రత్యేక తగ్గింపులు మరియు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ భారతదేశంలోని ప్రయాణికులకే కాకుండా మధ్యప్రాచ్యం మరియు ఆగ్నేయాసియాలోని వారికి కూడా వర్తిస్తుంది .