ప్రణయ్ హత్య కేసులో దోషిగా తేలిన సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇంతకీ ఇతడు ఎవరు ? ఎక్కడి వాడు ? ప్రణయ్ హత్యలో పాత్ర ఏమిటి ?
పోలీసులకు ఎలా చిక్కాడు ? ఈ కథనంలో తెలుసుకుందాం..
సుభాష్ శర్మ ఎవరు ? సుపారీ ఎలా తీసుకున్నాడు ?
సుభాష్శర్మ.. బిహార్ రాష్ట్రంలోని సమస్తీ పూర్ జిల్లా జగత్సింగ్పూర్ గ్రామానికి చెందినవాడు.
అతడు 13 ఏళ్లకే ఓటరు గుర్తింపు కార్డును అక్రమంగా సంపాదించాడు.
సుభాష్ తొలుత ఆయుధాలను అక్రమంగా సప్లై చేసేవాడు. ఈక్రమంలో అరెస్టు చేసి, మహారాష్ట్రలోని పూణే జైలుకు పంపారు.
2011లో ఏపీలోని రాజమండ్రిలో ఓ బంగారు దుకాణంలో దొంగతనం చేస్తూ సుభాష్ దొరికిపోయాడు.
సుభాష్ రాజమండ్రి జైలులో ఉండగా.. గుజరాత్ హోం మంత్రి హరేన్ పాండ్యా హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్బారీ, అస్గర్ అలీలతో పరిచయం ఏర్పడింది. వాళ్లు రూ.కోటి వరకు ఇస్తామంటూ.. ప్రణయ్ను హత్య చేసేందుకు సుభాష్ శర్మను ఒప్పించారు.
అమృత (ప్రణయ్ భార్య) తండ్రి మారుతీ రావు నుంచి అబ్దుల్బారీ, అస్గర్ అలీలకు డబ్బులు అందాయి. ఆ డబ్బులనే ప్రణయ్కు ఇచ్చారు.
ప్రణయ్ను హత్య చేసేందుకు నెల రోజుల వ్యవధిలో సుభాష్ శర్మ నాలుగైదుసార్లు రెక్కీ చేశాడు. అయితే టైమింగ్ సెట్ కాలేదు.
ఐదోసారి రెక్కీ నిర్వహించిన సమయంలో టైమింగ్ కుదరడంతో ప్రణయ్ను సుభాష్శర్మ హత్య చేశాడు.
ప్రణయ్ను(Pranay Murder Case) మిర్యాలగూడలో హత్య చేసిన వెంటనే సుభాష్శర్మ బిహార్లోని తన సొంతూరికి వెళ్లిపోయాడు.
ఈ కేసును నాటి ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో అనుభవం ఉన్న పోలీసు అధికారి బాషాను బిహార్కు పంపారు.
బాషా బిహార్కు వెళ్లి, సమస్తీపూర్ పోలీసులను సంప్రదించారు. అయితే అక్కడి పోలీసుల నుంచి సహకారం లభించలేదు.
దీంతో తాను ఎన్ఐఏలో పనిచేసినప్పుడు పరిచయమైన ఓ ఎస్పీ స్థాయి అధికారిని బాషా సంప్రదించారు. ఆయన ద్వారా సమస్తీపూర్ పోలీసుల సహకారాన్ని బాషా పొందారు.
చివరకు సుభాష్శర్మ సొంతూరు జగత్సింగ్పూర్కు బాషా అండ్ టీమ్ చేరుకున్నారు.
ఆ ఊరిలో సుభాష్శర్మను బాషా అండ్ టీమ్ అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో పోలీసులపై సుభాష్శర్మ సోదరుడు, వందమంది వరకు దాడికి యత్నించారు. వారి వాహనాలను చాలాదూరం వెంబడించారు.
ఎలాగోలా కష్టపడి సుభాష్శర్మను పాట్నాకు బాషా తరలించారు. పాట్నా నుంచి హైదరాబాద్కు.. అక్కడి నుంచి నల్గొండకు తీసుకొచ్చారు.
































