Curd : రోజూ పెరుగు తింటే ఆ క్యాన్సర్ మటుమాయం..!

Curd : ఈ రోజుల్లో ఎప్పుడు ఏ రోగం వచ్చేది కూడా తెలియట్లేదు. అందులోనూ క్యాన్సర్ వచ్చిందంటే మాత్రం దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. ప్రస్తుత కాలంలో ఎంత టెక్నాలజీ వచ్చినా సరే ఈ క్యాన్సర్ కు మాత్రం మందులు పనిచేయట్లేదు.


ఎన్ని మందులు వాడినా సరే అస్సలు తగ్గట్లేదు. అధునాతన ట్రీట్ మెంట్లు వచ్చినా సరే క్యాన్సర్ తగ్గకపోవడంతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే క్యాన్సర్లలో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువ మందికి వస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా వస్తోంది.

Curd : కాలుష్యంతో కూడా..

వాస్తవానికి స్మోకింగ్ చేసే వారిలోనే ఇది ఎక్కువగా కనిపిస్తోంది. అంతే కాకుండా పొగాకు తాగేవారిలో కూడా కనిపిస్తోంది. కేవలం పొగ తాగే వారిలోనే కాకుండా పొగ పీల్చే వారిలో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు వీరే కాకుండా అటు కాలుష్యంతో కూడా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో 20 శాతం మంది సిగరెట్లు తాగని వారే ఉంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం జీవన విధానంలో వస్తున్న మార్పులు కూడా కావచ్చు.

కాగా ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు చేయాలని చెబుతున్నారు. దాంతో పాటు రోజూ తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే ఊపిరిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఏదో తమాషాకు చెబుతున్న విషయం కాదండోయ్.. ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత చెబుతున్న మాట. రోజుకు సుమారు 85 గ్రాముల పెరుగు తినే మగవారికి, 113 గ్రాముల పెరుగు తినే ఆడవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 19% వరకు తక్కువ.

Curd : రోజూ పెరుగు తింటే ఆ క్యాన్సర్ మటుమాయం..!

ఎందుకంటే పెరుగులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది లంగ్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని బాగానే తగ్గిస్తుంది. దాదాపు 14 లక్షల మందిని పరిగణలోకి తీసుకొని వారిపి రీసెర్చ్ చేయగా ఈ విషయాలు తెలిశాయి