అరటి ఆకులో భోజనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా

www.mannamweb.com


భారత దేశంలో భోజనం అనగానే అరటి ఆకు భోజనమే గుర్తుకు వస్తుంది. ఇప్పుడంటే అరటి ఆకుల్లో భోజనం తగ్గించేశారు. కానీ ఇంతకు ముందు అరటి ఆకుల్లోనే భోజనం వడ్డించేవారు.

ఇప్పుడు అంతా ప్లాస్టిక్ ప్లేట్స్‌లో పెడుతున్నారు. ఈ ఆకుల్లో భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కానీ అరటి ఆకులో భోజనం చేయడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అరటి ఆకులో భోజనం చేస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలీదు. మరి అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్లు మెండు:

అరటి ఆకే కదా అని తీసి పారేయడానికి వీల్లేదు. ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మెండుగా ఉంటాయి. ఇవి ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాలు, గ్రీన్ టీలో కూడా కనిపిస్తాయి. ఈ ఆకులో భోజనం చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి బాగా అందుతాయి.

సూక్ష్మ క్రిములను దూరం చేస్తుంది:

అరటి ఆకులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఆహారంలోని సూక్ష్మ క్రిములను దూరం చేస్తుంది. కాబట్టి ఈ ఆకులో ఆహారం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పలు అనారోగ్య సమస్యలు రాకుంా ఉంటాయి.

ధర తక్కువ:

అరటి ఆకుల్లో భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిదే కాదు. వీటి ధర కూడా చాలా తక్కువ. కాబట్టి వీటి కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు. డబ్బు కూడా ఆదా అవుతుంది.

పర్యావరణానికి అనుకూలం:

ఇప్పుడు భోజనం చేసే ప్లాస్టిక్ ప్లేట్స్ కంటే.. అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇవి భూమిలో త్వరగా ఇంకిపోతాయి. పర్యావరణానికి చాలా మంచిది.

పరిశుభ్రంగా ఉంటుంది:

ఇతర పాత్రలు, ఆకుల కంటే పోల్చితే అరటి ఆకుల్లో తినడం చాలా మంచిది. కేవలం వీటిని నీటితో కడిగి ఉపయోగిస్తే చాలు. అరటి ఆకులపై మైనపు పూత ఉంటుంది. ఇది ఆకుల ఉపరి తలంపై మురికి, దుమ్ము అంటుకోకుండా చేస్తుంది. ఆహారంలోని సూక్ష్మ క్రిములను దూరం చేసి.. చక్కటి రుచులను అందిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)