కస్టమర్లకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. బుకింగ్ రోజే డెలివరీ

www.mannamweb.com


ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పింది. కస్టమర్లు ప్రొడక్ట్‌లను బుకింగ్ చేసిన రోజే డెలివరీలను అందించనున్నట్లు ప్రకటించింది.
ఈ సదుపాయం మొదట్లో దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత దేశం అంతటా ఈ సేవను విస్తరించి, బుకింగ్ చేసిన అదే రోజు డెలివరీ చేస్తామని అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి నెలలో ఈ సదుపాయం ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. మొదట 20 నగరాల్లో ఇది అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, కోయంబత్తూరు, చెన్నై, ఢిల్లీ, గౌహతి, ఇండోర్, జైపూర్, కోల్‌కతా, లక్నో, లూథియానా, ముంబై, నాగ్‌పూర్, పూణే, పాట్నా, రాయ్‌పూర్, సిలిగురి, విజయవాడలలోని కస్టమర్లకు ఇది అందుబాటులోకి వస్తుంది.

వినియోగదారులు ఒకే రోజు డెలివరీని పొందడానికి, అర్హత ఉన్న వస్తువును మధ్యాహ్నం 1 గంటలోపు ఆర్డర్‌ను చేయవలసి ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఆ వస్తువును 12am (అర్ధరాత్రి) లోపు డెలివరీ చేస్తామని కస్టమర్‌కు హామీ ఇస్తుంది. ఒకవేళ మధ్యాహ్నం 1 గంట తర్వాత చేసిన ఆర్డర్‌ చేసిన వాటిని మాత్రం మరుసటి రోజు డెలివరీ చేస్తామని కంపెనీ తెలిపింది.

ఈ సదుపాయం దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. అప్పటి వరకు ఈ నగారాల్లో ఈ సేవను వినియోగించుకోవచ్చు, మొబైల్‌లు, ఫ్యాషన్, బ్యూటీ వస్తువులు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు, పుస్తకాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌తో సహా అనేక ఉత్పత్తులు ఒకే రోజు డెలివరీకి అర్హత పొందుతాయని సంస్థ తెలిపింది.