పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ నుంచి తప్పిపోయిన ఒకటో తరగతి విద్యార్థి రెండు రోజుల తర్వాత అనుమానస్పద స్థితిలో శవమై కనిపించాడు.
అదృశ్యమైన బాలుడి మృతదేహాన్ని పాఠశాల సమీపంలోని చెరువులో గుర్తించారు.. చిన్నారి ఆచూకీ కనిపించకపోవటంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే పాఠశాలకు 400 మీటర్ల దూరంలో ఉన్న చెరువు నుండి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడు చెరువులో మునిగిపోయి ఉంటాడని తొలుత అనుమానం వ్యక్తం చేశారు. అయితే విచారణలో చిన్నారిని అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి హత్య చేసి చెరువులో పడేసినట్లు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బాలుడి తలపై కొట్టిన గాయాలున్నట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలిసింది. దాంతో బాలుడిని ఎవరో చంపేసి, చెరువులో పడవేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బాలుడు అదృశ్యమైనప్పటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థి పాఠశాలకు రావటం లేదని పోలీసులు గుర్తించారు. దాంతో అతనిపై అనుమానం వ్యక్తం చేశారు.. ఎనిమిదో తరగతి విద్యార్థిని విచారించగా, బాలుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు. అందుకు అతడు చెప్పిన కారణం తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు.
స్కూల్కి సెలవు కావాలనే నెపంతోనే ఒకటో తరగతి విద్యార్థిని హత్య చేసినట్టుగా అంగీకరించాడు. స్కూల్లో ఎవరైనా విద్యార్థి చనిపోతే స్కూల్కి సెలవు ప్రకటిస్తారని భావించినట్లు నిందితుడు విద్యార్థి వెల్లడించాడు. పాఠశాలకు సెలవు ప్రకటించిన తర్వాత, అతను హాస్టల్ నుండి తన ఇంటికి వెళ్లాలనుకున్నాడు. దీంతో బాలుడిని హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసినట్టుగా పోలీసుల విచారణలో నిందితుడైన ఎనిమిదో తరగతి విద్యార్థి అంగీకరించినట్టుగా చెప్పారు.
Related News
ఆంధ్రప్రదేశ్లో ఈ నెలలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని ఓ పోలీసు అధికారి సస్పెండయ్యాడు. బం...
Continue reading
నేటి కాలంలో అన్ని ఆన్లైన్ చెల్లింపులే అయ్యాయి. రోడ్డుపక్కన చిన్న చిన్న దుకాణాలు మొదలు మాల్స్ వరకు కూడా డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నాం. యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక చేత...
Continue reading
కొన్ని దొంగతనాలను చూస్తే వీళ్లేం దొంగలురా బాబు అనిపిస్తుంది. ఏ గ్రహం నుంచి వచ్చార్రా బాబు అనక మానరు. అలాంటి దొంగతనమే వెలుగుచూసింది హైదరాబాద్లో. ఓ చక్కటి ఫ్యామిలీలో.. భర్తను మిగిల...
Continue reading
తమిళనాడులోని తేన్ కాశి జిల్లాలో పశ్చిమ కనుమల వద్ద కొలువుదీరిన పుణ్యక్షేత్రం… కుర్తాళం.
ఇక్కడి జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. అయితే ఈ ప్రాంతంలో గత ఐదు రోజులుగా వి...
Continue reading
తాడ్వాయిమండలంలోని కాటాపూర్ 3వ అంగన్వాడి సెంటర్ టీచర్ రడం సుజాత హత్య పెద్ద సంచలనంగా మారింది.
అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ ఆదేశాల మేరకు పస్రా సీఐ శంకర...
Continue reading
తల్లిదండ్రులు చేసిన చిన్న చిన్న నిర్లక్ష్యపు పనుల వల్ల.. అభం శుభం తెలియని చిన్నారులు బలైపోతున్నారు. భార్యా భర్తల మధ్య గొడవలు జరిగినప్పుడల్లా.. పిల్లలపై ప్రతాపాలు చూపిస్తుంటారు. వార...
Continue reading
దేశ రాజధాని ఢిల్లీలో మెట్రోలో ప్రేమ జంటల రొమాన్స్ తరచూ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా మరో ప్రేమ జంట రెచ్చిపోయింది. అయితే ఈ సారి మెట్రోలో కాకుండా ఏకంగా పబ్లిక్ రవాణ...
Continue reading
సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు.
అయితే.....
Continue reading
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల అధికారులకు చిక్కకుండా సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నియో...
Continue reading
ప్రస్తుతం డిజిటల్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ ఎక్కువైపోయారు. కొంతమంది కేవలం యూట్యూబ్ వంటి వాటిని కెరీర్ గా మలుచుకుని కళ్లు చెదిరే మొత్తాలు రాబడుతున్నారు.
మీరు ఆకట...
Continue reading
Boy who applies tilak in ayodhya ram lalla mandir revealing his daily earnings: వందల ఏళ్ల నాటి కల రామజన్మభూమిలో రామ్ లల్లా ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం వేడుకగా సాగింది. దేశ ప్రధాని ...
Continue reading
కాలం మారుతూ వస్తుంది.. మారుతున్న కాలంతో పాటు నిత్యావసర ధరలు, వస్తువుల ధరలు పెరగడం సహజం. అయితే, ఒక్కప్పుడు ఉండే ధరలకు.. ఇప్పుడు ఉన్న ధరలకు వ్యత్యాసం ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్...
Continue reading