మహిళలకు శుభవార్త . అకౌంట్లోకి 15వేలు వేయనున్న ప్రభుత్వం.!

కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఒక శుభవార్త చెప్పింది. మహిళలకు ఒక్కొక్కరికి 15వేల రూపాయల ప్రయోజనం కలిగించే కార్యక్రమాల అమలు చేయ బోతుంది అని తెలిపింది.


ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రిటిష్ వారు రాకముందు వరకు కూడా మన దేశంలో చేతివృత్తులు చేసుకునే వారికి మంచి ఆదాయం అయితే ఉండేది. దాని తర్వాత క్రమంగా వారి ఆదాయం తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం గ్రామాలలో సైతం చేతివృత్తులు చేసుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కొన్ని వృత్తులకు సంబంధించిన వారైతే పూర్తిగా కనుమరుగయ్యారు. ఈ తరుణంలో సాంప్రదాయ చేతి వృత్తుల వారిని ప్రోత్సహిస్తూ వారి ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా ఒక పథకాన్ని ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసినదే. దీని వలన సుమారు ఐదు సంవత్సరాల వ్యవధిలో సాంప్రదాయ చేతివృత్తులు చేసుకునే వారికోసం 15వేల కోట్ల రూపాయలు కేటాయించటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇక కొత్తగా ఈ పథకానికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఆ వివరాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయ చేతివృత్తుల వారి కోసం సీఎం విశ్వకర్మ ఒక పథకాన్ని ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసినదే. సాంప్రదాయ పనిముట్లు,చేతులను ఉపయోగించి పనిచేస్తున్న కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులలో బలోపేతం చేసేందుకే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. వారు చేస్తున్నటువంటి ఉత్పత్తుల నాణ్యతను పెంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల తో వారిని అనుసంధానించి,వారి ఆదాయాన్ని పెంచటానికి ఈ పథకాన్ని తీసుకువచ్చారు. దేశంలోని గ్రామీణ,పట్టణ ప్రాంతాలలో కళాకారులు చేతివృత్తుల వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది. అయితే ముందుగా 18 సంప్రదాయ వృత్తులకు చెందిన వారికి ఈ స్క్రీమ్ కు సంబంధించిన ప్రయోజనాలు అందుతాయి.
ఈ పథకం వలన ఆయా వృత్తుల వారికి సీఎం విశ్వకర్మ సర్టిఫికెట్ తో పాటుగా గుర్తింపు కార్డును కూడా ఒకటి ఇవ్వనున్నారు. అలానే తొలి విడత కింద లక్ష, రెండో విడత కింద రెండు లక్షల రూపాయలు రుణం ఇస్తున్నట్లుగా తెలిపారు. దీనికి కేవలం 5% వడ్డీ మాత్రమే వసూలు చేయనున్నారు. అలాగే చేతి వృత్తుల వారి కోసం కూడా ప్రత్యేక శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇక్కడ బేసిక్ నుండి అడ్వాన్స్డ్ స్థాయి వరకు ట్రైనింగ్ కార్యక్రమాలు అనేవి ఉంటాయి. శిక్షణ తీసుకునే వారికి రోజుకు 500 రూపాయలు చొప్పున స్టే ఫండ్ కూడా ఇవ్వనున్నారు…

రూ.15000 విలువైన టూల్ కిట్ : అంతే చేతివృత్తుల వారు తమకు అవసరమైనటువంటి పారిశ్రామిక పనిముట్లను కూడా కనుక్కోవటం కోసం అవసరమైనటువంటి వారికి 15 వేల రూపాయలను కూడా ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే వీరిలో మహిళలకు అధిక ప్రాధాన్యత అనేది ఇస్తున్నట్లుగా గతంలోనే తెలిపారు. ఇక ఈ స్కీమ్ అనేది ప్రారంభించిన 20 రోజులలోనే దేశవ్యాప్తంగా సుమారు 5.24 లక్షల మంది కూడా దరఖాస్తు చేశారు. ఇక ఇప్పుడు కిట్ కోసం అప్లై చేసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నది.

Women టూల్ కిట్ కోసం ఎలా అప్లై చేయాలి అంటే

సీఎం విశ్వకర్మ టూల్ కిట్ ఇ -వోచర్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసేందుకు,మీరు ముందుగా పీఎం విశ్వకర్మ అధికారిక వెబ్ సైట్ https://pmvishwakarma.gov.in/. ను సందర్శించాలి.
– మీరు స్కీమ్ అధికారిక వెబ్ సైట్ హోమ్ పేజీలో, ఐడి పాస్వర్డ్ సహాయంతో మీ ఖాతాను లాగిన్ చేసుకోవాలి. •ఖాతాను తెరిచిన తరువాత మీరు కొత్త పేజీకి వెళ్ళాలి.
– అక్కడ మీరు కొత్త అభ్యర్థి ఆప్షన్ ఎంపికపై క్లిక్ చేసుకోవాలి.
– దాని తర్వాత మీరు మీ రిజిస్ట్రేషన్ ఫామ్ ను జాగ్రత్తగా నిప్పుకోవాలి.
-ప్రస్తుతం మీకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
– సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి.
– ఎలా చేయటం వలన మీ పేరు పథకంలో నమోదు చేస్తారు.
-మీ వివరాలు అన్నింటిని కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాత అర్హులు అనుకుంటే అప్పుడు మీకు సంబంధించిన నగదు అనేది వస్తుంది.
– తొందరలోనే ప్రభుత్వం ఈ టూల్ కిట్ కు సంబంధించిన మొత్తాన్ని మీ ఖాతాలో జమ చేస్తారు…