Vastu Tips: వచ్చిన ఆదాయం వచ్చినట్లే పోతుందా.? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే..

ప్రతీ ఒక్కరికీ ఆర్థికంగా ఎదగాలనే కోరిక ఉంటుంది. అందుకే సంపాదించిన దాంట్లో ఖర్చులు పోను ఎంతో కొంత పొదుపు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎంత సంపాదించినా రూపాయి నిలవదు. వచ్చి ఆదాయం వచ్చినట్లే పోతుంది. వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం, ఇంటి వాస్తు ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


* ఇంట్లో ఉపయోగించే చీపురు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. చీపురు విషయంలో చేసే వాస్తు తప్పులు ఆర్థికంగా ఇబ్బందికి గురి చేస్తుందిన అంటున్నారు. చీపురును ఇంటి తలుపు దగ్గర ఎప్పుడూ ఉంచవద్దు. ఇలా చేస్తే వాస్తు దోషం వస్తుంది. చీపురు కాలికి తగలకుండా చూసుకోవాలి. దీనివల్ల ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

* ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైలపు అశోక చెట్టుకు సంబంధించిన చెట్టు నాటాలి. దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బలదూర్‌ అవుతుంది.

* ఇక ఈశాన్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి ఈశాన్యంలో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. అలాగే ఈశాన్యం దిశలో బీరువా వంటి భారీ వస్తువులు ఉండకూడదు.

* ఇక ఇంట్లో గోడలకు ప్రకృతికి సంబంధించిన అందమైన సీనరీలను ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఇంట్లో ఉండే వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ప్రశాతంతా లభిస్తుంది. అలాగే నెగిటివ్‌ ఎనర్జీ దూరమవుతుంది.

* ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్‌ పువ్వులు లేదా వాడిపోయిన పువ్వులను పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో వాలిన పూలు ఉంచితే నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లో వాడిపోయిన పూలు ఉంటే వెంటనే తొలగించాలి.

* ఇక ఇంట్లో కచ్చితంగా ఈశాన్యంలో తులసి మొక్కను నాటాలి. దీంతో పాటు, ప్రతిరోజూ సాయంత్రం తులసి మొక్క కింద స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీ దేవీకి ప్రతిరూపంగా ఉండే తులసి మొక్కను పూజించడం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మెరగవుతాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.