ఈ స్వామిని దర్శిస్తే మధుమేహం నయమవుతుందని చెబుతారు.

మిళనాడు రాష్ట్రం తంజావూరు నగరం నుంచి 26 కి.మీ. దూరంలో అమ్మపేట గ్రామంలో తిరువెన్ని ఆలయం ఉంది. ఇక్కడ లింగ రూపంలో ఉండే శివుడు వెన్ని కరుంబేశ్వరర్‌గా, పార్వతిదేవి సుందరి నాయకిగా పూజలందుకుంటున్నారు.


ఇది స్వయంభూ దేవాలయం. పూర్వం ఈ ప్రదేశం చెరకు (కరుంబు), వెన్ని (నందివర్ధనం) చెట్లతో నిండి ఉండేదట. అందుకే ఈ స్వామిని వెన్ని కరుంబేశ్వరర్‌ అని పిలుస్తారన్నది స్థానికుల కథనం. చేతిలో చెరకుముక్కను పట్టుకుని ఉన్న శివుడి ప్రతిమ ఆలయంపై దర్శనమిస్తుంది.

ఈ స్వామిని దర్శించుకుంటే మధుమేహ వ్యాధి నయమైపోతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆ నమ్మకంతోనే దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి వెళ్లి స్వామికి గోధుమరవ్వ, చక్కెరతో చేసిన మిఠాయిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ ప్రసాదంలో కొంత భాగాన్ని చీమల కోసం పెడతారు. అవి గనుక ప్రసాదాన్ని తింటే తమ వ్యాధి తగ్గుతుందని నమ్ముతారు. ఇది శ్రీకృష్ణుడు ప్రతిష్టించిన శివలింగమని, ఎంతో మహిమాన్వితమని భక్తులు నమ్ముతారు. విదేశీయులు సైతం మధుమేహ వ్యాధి నివారణ కోసం ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.