Food Tips: ఫ్రిడ్జ్‌లో చపాతీ పిండిని కలిపి పెడుతున్నారా.. చాలా డేంజర్

Food Tips: తరచూ తినే ఆహార పదార్థాల్లో మిగిలిన వాటిని ఫ్రిడ్జిల్లో స్టోర్ చేస్తుంటారు. ఇలా కొన్ని రోజుల పాటు కూడా పెట్టుకుని తినే వారు ఉంటారు. పాలు, పెరుగు, కూరగాయలు, పండ్లు, వండిన కూరలు, ఆహారం వంటివి చాలా పదార్థాలను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తుంటారు. ఈ తరుణంలో చపాతీలు చేసుకునేందుకు పిండి కలుపుకుని అప్పటి వరకు సరిపడా చేసుకున్న తరువాత తిరిగి దానిని మళ్లీ ఉపయోగిస్తారు. ఈ తరుణంలో మిగిలిన పిండిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

చపాతీ పిండిని ఎప్పటికి అప్పుడు కలిపి చేసుకోవడం వల్ల చక్కగా వస్తాయి. అంతేకాదు ఇలా తినడం ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ మిగిలిన పిండిన ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి దానిని తిరిగి ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన చపాతీ పిండిని చపాతీలు చేసుకుని తినడం వల్ల కడుపు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపు నొప్పి, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయట. ఫ్రిడ్జిలో పెట్టిన పిండిని చపాతీలు చేసుకుని తినడం వల్ల కడుపులో బ్యాక్టీరియా సమస్యలు తలెత్తుతాయి.

చపాతీ పిండిని ఎప్పటికి అప్పుడు తినడం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. కానీ దానిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి తినడం వల్ల అందులోని పోషకాలను కోల్పోయే అవకాశం ఉంటుందట. అంతేకాదు ఇలా తయారు చేసే చపాతీలు రుచిని కోల్పోతాయి. అందువల్ల ఫ్రిడ్జిలో స్టోర్ చేసిన చపాతీ పిండిని అస్సలు వాడకూడదని నిపుణులు చెబుతున్నారు.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *