ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం దేశ బడ్జెట్ను సమర్పించారు ఈ బడ్జెట్లో అద్దె చెల్లించే యజమానులకు శుభవార్త అందించారు. ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయ పరిమితిని ప్రస్తుతం ఏడాదికి రూ.
2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచాలని ప్రభుత్వ ప్రతిపాదన ఉంది.2025-26 ఆర్థిక సంవత్సరానికి అద్దెపై TDS పరిమితిని పెంచాలని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.ఈ పెరుగుదల తక్కువ అద్దె చెల్లించే పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలిగించనున్నది.ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194-I ప్రకారం ఇంటి అద్దె ఆదాయం ఒకటి సంవత్సరానికి రూ.2.4 లక్షలకు మించకుండా ఉంటే పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ 2025-26 బడ్జెట్లో ఈ పరిమితిని నెలకు రూ.50,000 (సంవత్సరానికి రూ.6 లక్షలు) చేయాలని ప్రతిపాదించారు.ఈ కొత్త నిబంధన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు లేదా హిందూ అవిభక్త కుటుంబాలకు వర్తిస్తుంది.
































