ఒక్కరు కూడా హాజరు కాలేదు..

 పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో మంగళవారం జరిగిన పదో తరగతి ఇంగ్లీష్‌ సప్లిమెంటరీ పరీక్షకు ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు.


ఈ పరీక్షను ఆరుగురు విద్యార్థులు రాయాల్సి ఉంది. దీనికోసం ఈ పరీక్ష కేంద్రానికి చీఫ్‌సూపరింటెండెంట్‌ జి.రవిప్రసాద్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి డి.నాగమణి, ఇన్విజిలేటర్‌ ఎ.బాబూరావుతో పాటు క్లర్క్‌, ఆఫీస్‌ సబార్డినేటర్‌, స్వీపర్‌, వాటర్‌మన్‌లను నియమించారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. అయితే, ఒక్క విద్యార్థి కూడా హాజరుకాకపోవడంతో సమయం ముగిసే వరకూ పరీక్ష కేంద్రం సిబ్బంది నిరీక్షించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.