NPCIL ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025: 400 ఖాళీలు, రాత పరీక్ష లేకుండా అవకాశం

ప్రభుత్వ ఉద్యోగాలకు సాధారణంగా రాత పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు అనేది తప్పనిసరి. కానీ, ఇప్పుడు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ద్వారా 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష అవసరం లేదు, కేవలం GATE స్కోర్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


పోస్టులు & ఖాళీల వివరాలు:

శాఖ ఖాళీల సంఖ్య
మెకానికల్ 150
కెమికల్ 60
ఎలక్ట్రికల్ 80
ఎలక్ట్రానిక్స్ 45
ఇన్స్ట్రుమెంటేషన్ 45
సివిల్ 45
మొత్తం 400

అర్హతలు:

  • కనీస శాతం: BE/BTech/BSc (ఇంజనీరింగ్) లేదా 5-సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ MTech 60% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి.
  • GATE స్కోర్: 2023/2024/2025 సంవత్సరాల GATE స్కోర్ చెల్లుబాటు అవుతుంది.
  • వయసు పరిమితి:
    • జనరల్/EWS: 26 సంవత్సరాలు
    • OBC (NCL): 29 సంవత్సరాలు
    • SC/ST: 31 సంవత్సరాలు

ఎంపిక ప్రక్రియ:

  • GATE స్కోర్ + ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
  • ట్రైనీగా ఎంపికైతే ₹74,000 స్టైపెండ్ (నెలసరి).
  • ట్రైనింగ్ తర్వాత సైంటిఫిక్ ఆఫీసర్ (గ్రూప్ C)గా నియమితులై ₹56,100 ప్రారంభ జీతం.

ఫీజు వివరాలు:

వర్గం దరఖాస్తు ఫీజు
జనరల్/EWS/OBC (NCL) – పురుషులు ₹500
SC/ST/మహిళలు/PH ఫీజు లేదు

దరఖాస్తు ప్రక్రియ:

  • చివరి తేదీ: ఏప్రిల్ 30, 2025
  • ఆఫీషియల్ వెబ్‌సైట్: NPCIL Official Website