PM Modi: ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్‌ ఖరారు

విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఈనెల 6, 8 తేదీల్లో నాలుగుచోట్ల ప్రధాని పర్యటన ఉంటుందని కూటమి నేతలు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

విజయవాడలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌, ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు, జనసేన అధికార ప్రతినిధి గౌతం మాట్లాడారు. 6వ తేదీ ఉదయం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కశింకోట మండలం ఊగినిపాలెం వద్ద, 8వ తేదీ ఉదయం రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పీలేరు మండలం కలికిరి వద్ద బహిరంగసభలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో కలిసి ప్రధాని పాల్గొంటారని తెలిపారు. ఎనిమిదో తేదీ సాయంత్రం 5గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానం నుంచి బెంజి సర్కిల్‌ వరకు రోడ్‌షోలో ప్రధాని పాల్గొంటారని వివరించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *