Raajadhani Files : అమరావతే రాజధాని అంశంతో రూపొందిన “రాజధాని ఫైల్స్ “.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..

మరికొద్దిరోజులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం పొలిటికల్ సినిమాలు హాట్‍టాపిక్‍గా మారుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ప్రధాన అంశంగా రూపొందిన ‘ యాత్ర 2’ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లలోకి రానుంది.అలాగే ఏపీ రాజకీయాలపై వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం చిత్రం విడుదలకు కోర్టు అభ్యంతరం తెలిపింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై మరో మూవీ వస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అంశంపై ‘రాజధాని ఫైల్స్’ చిత్రం రూపొందింది. ఈ మూవీ ట్రైలర్ నేడు (ఫిబ్రవరి 5) రిలీజ్ అయింది.ఆంధ్రప్రదేశ్ పేరును ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్లో మేకర్స్ నేరుగా ప్రస్తావించలేదు. అలాగే, రాజకీయ పార్టీల పేర్లను కూడా మార్చి చూపించారు. ఏపీకి మూడు రాజధానులను ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించగా.. ఇందులో నాలుగు రాజధానులు అంటూ మార్పు చేశారు. అయితే, ఇవి ఇలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపైనే ‘రాజధాని ఫైల్స్’ రూపొందిందని ట్రైలర్‌ చూస్తేనే తెలిసిపోతుంది..


ఈ చిత్ర దర్శకుడు భాను అమరావతే రాజధానిగా ఉండాలని రైతులు చేస్తున్న పోరాటం,ఆవేదన, పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కొన్ని పాత్రలు కూడా ప్రస్తుత రాజకీయ నాయకులను పోలినట్టు అయితే ఉన్నాయి. ఈ మూవీలో అఖిలన్ మరియు వీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే వారు వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు.రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూపించే షాట్‍తో ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ మొదలైంది.ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. అరుణప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదన నేపథ్యంలో ‘రాజధాని ఫైల్స్’ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. శ్రీమతి బిందు సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో వినోద్‌కుమార్‌, వాణీ విశ్వనాథ్‌, పవన్‌, మధు, అజయ్‌రత్నం, అంకిత ఠాకూర్‌, అమృత చౌదరి తదితరులు నటిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.ఈ ట్రైలర్లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో హైలైట్‍గా ఉంది. కంఠమనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఫిబ్రవరి 15వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది .

ట్రైలర్ వీడియో చూడండి…