Refrigerator: ఈ విషయం తెలిస్తే ఫ్రిజ్ వాడాలంటే భయపడతారు

Refrigerator: ఫ్రిజ్ ను వాడని వారు ఉంటున్నారా? ప్రతి ఒక్కరు ఈ మధ్య ఈ ఫ్రిజ్ ను వాడుతున్నారు. పూరి గుడిసెల నుంచి పెద్ద పెద్ద విల్లాల వరకు ఈ ఫ్రిజ్ లు ఉంటున్నాయి. ఇక ఈ ప్రిజ్ లు మనుషుల ప్రాణాలను కూడా తీస్తున్నాయి. వామ్మో ఇదేంటి ఫ్రిజ్ కు ఏమైనా ప్రాణం ఉందా ప్రాణాలు తీయడానికి అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు మీరు కింద తెలిపిన విషయం చదివిన తర్వాత ఫ్రిజ్ వాడాలంటే భయపడతారు. ఇంతకీ ఈ ఫ్రిజ్ లు మనుషులకు ఎలాంటి నష్టాలను తెస్తున్నాయో ఓ సారి తెలుసుకోండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

మానవులు ఆరోగ్యాన్ని పాడు చేసే మొట్టమొదటి వస్తువు ఏది అంటే ఫ్రిజ్ అంటున్నారు నిపుణులు. అయితే ఫ్రిజ్ లో కూరగాయలను, ఇతర ఐటమ్స్ ను పెట్టినప్పుడు రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ చల్లదనం ఉంటుంది. రూమ్ టెంపరేచర్ కు తగ్గట్టు ఉన్న ఆహార పదార్థాల వల్ల ఎలాంటి సమస్యలు దరిచేరవు అంటున్నారు నిపుణులు. ఫ్రిజ్ లో పెట్టి మళ్లీ వాటిని వేడి చేసి తినడం వల్ల ఆయా వస్తువుల్లో ఉన్న పోషక విలువలను పూర్తిగా తగ్గిపోతాయి. అంతేకాదు ఆ పదార్థాలు విషంగా కూడా మారవచ్చు అంటున్నారు నిపుణులు.

నమిలి తినడం అనే ప్రాసెస్ లో లాలాజలం చాలా ఉపయోగపడుతుంది. కానీ చల్లని పదార్థాలు తినడం వల్ల ఈ లాలాజలం రాదు అంటున్నారు నిపుణులు. అంతేకాదు జీర్ణ వ్యవస్థ కూడా ఎక్కువగా పనిచేయదు. తిన్న ఆహారం జీర్ణం అవదట. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయట. ప్రిజ్ లో పెట్టిన పదార్థాలను తినాలి అనుకున్న రూమ్ టెంపరేచర్ కు వచ్చే వరకు ఉంచాలట. లేదంటే చాలా సమస్యలు వస్తాయట.

Related News

గతంలో చాలా మంది రాత్రి అన్నం తినేవారు కాదు. కానీ ఇప్పుడు ఒక రోజు లోనే పాడయ్యే పదార్థాలను రెండు మూడు రోజులు ఉంచి మరీ తింటున్నారు. ఇలాంటి వాటివల్ల మరింత సమస్యలు పెరుగుతున్నాయి. చెడిపోయే ఆహారాన్ని చల్లదనం వల్ల రెండు మూడు రోజులు ఉంచి తింటే సమస్యలు మరింత పెరుగుతాయి. అందుకే ఫ్రిజ్ చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. సో ఫ్రిజ్ ను ఉపయోగించే ముందు కాస్త ఆలోచించి వాడటం మంచిది అంటున్నారు నిపుణులు. మరి తస్మాత్ జాగ్రత్త.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *