Sri Reddy: విడదల రజినిపై శ్రీ రెడ్డి బూతు పురాణం

Sri Reddy: విడదల రజినిపై శ్రీ రెడ్డి బూతు పురాణం


నారా చంద్రబాబు నాయుడు సైబరాబాద్‌లో పెట్టిన చెట్టు ముక్కను సార్ నేను అంటూ టీడీపీ నుండి రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన విడదల రజిని, ఆ తరువాత కాలంలో వైసీపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఏ ఎండకు ఆ గొడుగు పట్టిందనే చెప్పాలి. టీడీపీలో ఉన్నప్పుడు అభివృద్ధి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అభివృద్ధి అని బహిరంగ సభలో వ్యాఖ్యానించిన రజిని, వైసీపీలో చేరిన తరువాత అవకాశాన్ని సృష్టించుకుని మరీ టీడీపీపై విమర్శల జల్లు కురిపించారు.

అయితే తాడును తన్నే వాడు ఉంటే వాడి తలను తన్నే వాడు ఉంటాడని, మనం ఇతరులకు ఏం ఇస్తే మనకు తిరిగి అదే వస్తుందని పేద్దలన్న మాట మరోసారి రజిని విషయంలో ఋజువైందని పలువురు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఫైర్ బ్రాండ్ శ్రీ రెడ్డి విడదల రజినిపై X వేదికగా బూతుల పురాణం వల్లించారు. మాజీ మంత్రి అయినటువంటి విడదల రజినిని వ్యాంప్‌గా శ్రీరెడ్డి సంబోధించారు.

టీడీపీ శ్రేనులను రెచ్చగొట్టి గెలుపుకోసం వైసీపీ ప్రయత్నించిందని సోషల్ మీడియా న్యూస్ చానెల్‌లో చూపించారిని, దీనికి కారణం విడదల రజినిని వెంట పెట్టుకుని తిరగడమే అని మండిపడ్డారు. రజినిని చెత్తతో పోల్చిన శ్రీ రెడ్డి, రజినిని పక్కన పెట్టుకుంటే ఇలా జరుగుతుందని, తాను ఈ విషయం ఎప్పుడో చెప్పానని అన్నారు.