Summer Halth Tips : ఎండలోంచి రాగేనే నీరు తాగేస్తున్నారా.. అలా అయితే ఈ ఇబ్బంది తప్పదు.. !

వేడి వాతావరణంలో ముఖ్యంగా వేసవిలో ప్రజలందరికీ పరీక్షా సమయం ఎందుకంటే పెరిగిన వేడి కారణంగా చెమట, తేమ కారణంగా దాహం తీవ్ర చికాకును తెప్పిస్తాయి. కొందరిలో ఒత్తిడి కూడా ఉంటుంది. దీనికి ద్రవాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండీలి. హైడ్రేట్ గా ఉండేందుకు ఇదో మార్గం. కాకపోతే చాలా తక్కువమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తూ వాతావరణాలనికి తగినట్టుగా నీటిని తీసుకుంటూ ఉంటారు. వేసవి లేదా వేడి వాతావరణం పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది. అసౌకర్యాన్ని పెంచుతుంది.


శరీరం ఉత్తేజంగా, ఉత్సాహంగా ఉండాలంటే మాత్రం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఏ సీజన్ అయినా నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వేసవిలో ఎక్కువ నీరు త్రాగాలి. ఎందుకంటే వాతావరణంలో వేడి కారణంగా శరీరంలో నీటిలోపం మొదలవుతుంది. అందువల్ల శరీరాన్ని చల్లగా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగాలి.

ఎండాకాలం దాహం వేయడం మామూలే. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే నీటిని తగు మొతాదులో తాగుతూ ఉండాలి. ఎండ బాగా ఉన్న సమయంలో బయటి నుంచి ఇంటికి వచ్చాకా కాసేపు ఉష్ణోగ్రతలో కూర్చోవాలి. ఆ తర్వాత శరీర ఉష్ణోగ్రత సాధారణమైన తర్వాత మాత్రమే నీరు తీసుకోవాలి.

వేసవిలో ఎక్కువ సేపు ఎండలో ఉండటం వల్ల కూడా డీహైడ్రేషన్ బారిన పడవచ్చు. దీన్ని తగ్గించాలంటే నీరు క్రమంగా తాగటం ముఖ్యం. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతూనే నీటి తీసుకోవాలి. అయితే వేడిలో నుంచి నీడకు రాగానే వెంటనే నీరు తాగకూడదు. ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు సమస్య మొదలవుతుంది.

అవసరం అయితేనే తప్ప ఇల్లు కదలకుండా ఇంటి పట్టునే ఉండాలి. రోజులో అత్యంత వేడిగా ఉండే సమయం ఉదం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలు.. ఈ మధ్యకాలంలో ఇంటిపట్టునే ఉండి లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి.

1. ఎండ నుండి బయటకు వచ్చిన వెంటనే నీరు తాగకూడదు..

2. సాధారణ ఉష్ణోగ్రతలో కాసేపు కూర్చున్న తర్వాత అప్పుడు నీటిని తీసుకోవాలి.

3. వేడివాతావరణంలో నీటిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్, కళ్లు తిరగడం వంటి సమస్యలు ఉంటాయి. దీనితో జ్వరం, వాంతులు, జలుబు, దగ్గు వంటివి పెరిగే అవకాశం ఉంది.