Triphala Water : ప్రతిరోజు ఉదయం ఈ త్రీఫల చూర్ణం తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో…?

www.mannamweb.com


Triphala Water : త్రిఫల అనే పదం మీరు వినే ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ముఖ్యంగా ప్రతిరోజు దీనిని ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో ఈ త్రీఫల గురించి చాలామందికి తెలియదు. కానీ ఆయుర్వేద గ్రంధాలలో త్రిఫల వేయి ఆరోగ్యకరమైన గుణాలను కలిగి ఉంటుందని చెబుతున్నాయి. అయితే వాస్తవానికి ఈ త్రీఫల అనేది సంస్కృత పదం. ఇక ఇది మూడు పండ్ల మిశ్రమం కాబట్టి దీనిని త్రీఫల అని పిలుస్తారు. దీనిని ఉసిరికాయ , తానికాయ , కరక్కాయ..పండ్లతో కలిపి తయారు చేయడం వలన త్రీఫలగా పిలుస్తారు. దీనిలో ఒక్కో పండులో ఉన్న ఒక్కో రకమైన పోషక మరియు ఆరోగ్య గుణాలు ఉండటం వలన ఆరోగ్యానికి ఇది చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. మరి ఈ త్రీఫలను ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Triphala Water : ప్రయోజనాలు…
త్రిఫల చూర్ణాన్ని మూడు పండ్ల మిశ్రమంతో ఎంతో నాణ్యతగా తయారు చేస్తారు. కావున దీని ప్రయోజనాలు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి.

Triphala Water : జీర్ణ క్రియ మెరుగుపరచడానికి…
త్రిఫల చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకే ప్రతిరోజు ఉదయం త్రిఫల లేదా త్రీఫల నానబెట్టిన నీటిని తాగటం వలన ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయుర్వేద గ్రంధాలలో ఈ త్రీఫల చూర్ణం తీసుకున్న తర్వాత గ్యాస్ మందులు అసలు తీసుకోకూడని సూచించారు. అంతేకాక ఆరోగ్య నిపుణులు సైతం అదే చెబుతున్నారు. కావున త్రిఫల చూర్ణాన్ని తీసుకున్నప్పుడు గ్యాస్ మందుకు దూరంగా ఉండటం మంచిది.
Triphala Water : దంతాల ఆరోగ్యం…
త్రీఫలను ప్రతిరోజూ తీసుకోవడం వలన దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక దంతాలపై ఉండే పసుపు మరకలను తొలగించడానికి , చిగుళ్ల నుండి రక్తస్రావం నివారించడానికి , నోటి దుర్వాసన వంటి సమస్యలను నివారించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాక త్రిఫల చూర్ణాన్ని తీసుకోవడం వలన శరీరంలో ఉండే అదనపు కొవ్వును సులువుగా కరిగించవచ్చు. అంతేకాక ఈ త్రీఫల వలన జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది. తద్వారా సులువుగా బరువు తగ్గుతారు.