సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఈమధ్య కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధించిన ల గురించి తెలుసా..
? థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న లు ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రేక్షకుల ఎంపికను దృష్టిలో ఉంచుకుని, చిత్రనిర్మాతలు ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. నార్త్ నుంచి దక్షిణాది వరకు నిర్మాతలు అలాంటి చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఈ సంవత్సరం విడుదలైన ఒక ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ల గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా దృశ్యం, విక్రమ్ వేద వంటి లు గుర్తుకువస్తాయి. కానీ మలయాళంలో వచ్చిన ఓ చిన్న ఈ రెండు ల కంటే ఎక్కువ ట్విస్టులు కలిగి ఉంది. ఇంతకీ అదెంటో తెలుసా.. ? అదే ఆఫీసర్ ఆన్ డ్యూటీ.
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో కుంచకో బోబన్, విశాక్ నాయర్, ప్రియమణి, మీనాక్షి అనుప్ ప్రధాన పాత్రలు పోషించారు. 20 ఫిబ్రవరి 2025న థియేటర్లలో విడుదలైన ఈ భారీ విజయాన్ని అందుకుంది ఈ చిత్రానికి జిత్తు అషరీఫ్ దర్శకత్వం వహించారు. కేవలం రూ.12 కోట్లతో నిర్మించిన ఈ ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లు వసూలు చేసింది. ఇది మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ల్లో ఒకటి. ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ ఇది.
ఒక నకిలీ అభరణాల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు నెమ్మదిగా క్రిమినల్ సిండికేట్ మాఫియా గురించి తెలుసుకుంటాడు. ఆద్యంతం ఆసక్తికరంగా.. క్షణక్షణం సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా సాగుతున్న ఈ దాదాపు 2 గంటల 14 నిమిషాల నిడివితో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీ దూసుకుపోతుంది.