Vastu Tips for Money: దిండు కింద వీటిని పెట్టి నిద్రపోయారంటే.. ధనలక్ష్మి ఇంట్లో తాండవం చేస్తుందట!

నిద్ర అనేది మనుషులకు చాలా అవసరం. కొందరు మధ్యాహ్నం 12 గంటల వరకు నిద్రపోతే.. మరికొందరు తెల్లవారుజామున నిద్రలేవడానికి ఇష్టపడతారు. కానీ కొందరిలో నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.


రాత్రి నిద్రపోకపోతే మానసికంగా శారీరకంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రాత్రంతా సరైన నిద్ర లేకపోయినా రోజంతా నీరసంగా ఉంటుంది. మానసిక అలసట అభివృద్ధి చెందుతుంది. నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

అయితే జ్యోతిష్య వాస్తుం ప్రకారం.. అదృష్ట చక్రం నిద్రలో కూడా తెరుచుకుంటుందట. సంపద, శ్రేయస్సును ఆకర్షించడానికి నిద్రతో చాలా దగ్గర సంబంధం ఉంటుందట. రాత్రి పడుకునేటప్పుడు మంచం కింద ఈకింద వస్తువులు పెడితే డబ్బు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతుందట. ముఖ్యంగా రాత్రి మంచం పక్కన ఒక గ్లాసు పాలు ఉంచి నిద్రపోతే చాలా మంచిదట. ఆ పాలను మరుసటి రోజు ఉదయం ఏదైనా ముళ్ల చెట్టుకు నైవేద్యంగా పెడితే ఫలితం ఉంటుంది. దీనిని వరుసగా 7 ఆదివారాలు పాటిస్తే ఆర్థికంగా, ఏడాది పొడవునా జేబులు కాసులతో గలగలలాడిపోతాయి.

రాత్రిపూట అకస్మాత్తుగా మేలుకువ వచ్చినా, పీడకలలు వచ్చినా దిండు కింద ఇనుప కత్తి లేదా ఏదైనా పదునైన ఇనుప వస్తువు ఉంచి నిద్రపోవాలట. ఇది పీడకలలను దూరం చేసి, నిద్రకు భంగం కలగకుండా చేస్తుంది. రోజంతా ఉల్లాసంగా, చురుకుగా ఉంచుతుంది.

వివిధ రోగాల నుండి విముక్తి పొందడానికి ఇంటికి తూర్పు వైపు తల పెట్టి నిద్రించాలి. దిండు కింద ఒక రూపాయి నాణెం కూడా ఉంచుకోవాలి. అలాగే పడకగదిలో ఒక గాజు గిన్నెలో రాక్ ఉప్పు కూడా ఉంచవచ్చు. ప్రతి వారం కంటెయినర్‌లోని ఉప్పును మార్చడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

ఇంట్లో చాలా ప్రతికూలతలు ఉంటే వాటి చుట్టూ మనస్సు తిరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు దిండు కింద ఒక వెల్లుల్లి రెబ్బను ఉంచుకోవాలి. వెల్లుల్లి బలమైన ఘాటు వాసన అన్ని చికాకులను, ప్రతికూలతను తొలగిస్తుంది. ఇది నిద్రను కూడా మెరుగుపరుస్తుంది.