క్రికెట్ లో ఆడటం, ఓడిపోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఎల్లవేళలా గెలుస్తూ ఆడలేం, అలాగని ఓడిపోతూ ఉండలేం. కానీ ఇదే ఫార్ములాని బయట బిజినెస్ లో అప్లై చేస్తే తీవ్రంగా నష్టపోతాం. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా సోదరులు ఇద్దరూ కలిసి, వరసకు సోదరుడైన వైభవ్ పాండ్యాతో కలిసి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. తీరా సొదరుడు మోసం చేశాడని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగప్రవేశం చేసి సోదరుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు.
వివరాల్లోకి వెళితే హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా.. ఇద్దరూ క్రికెట్ ఆడతారనే సంగతి తెలిసిందే. కృనాల్ బరోడా జట్టులో ఆడుతున్నాడు. ఐపీఎల్ లో లక్నో జట్టు తరఫున ఆడుతున్నాడు. వీరిద్దరూ కలిసి వరసకి సోదరుడైన వైభవ్ పాండ్యాతో కలిసి పాలిమర్ ప్లాస్టిక్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో బ్రదర్స్ ఇద్దరూ 40 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టారు. అంటే ఇద్దరూ 80శాతం పెట్టారు. వైభవ్ పాండ్యా ఏం చేశాడంటే తను 20 శాతం పెట్టాడు.
వ్యాపార నిర్వహణంతా వైభవ్ చూసుకునేలా బాధ్యతలను అప్పగించారు. కొన్ని నెలలు బాగానే ఉంది. వచ్చిన లాభాలను ఇదే నిష్పత్తి లో పంచుకున్నారు. అయితే పాండ్యా సోదరులకు తెలియకుండా కొద్దిరోజుల క్రితం వైభవ్ సొంతంగా మరో పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇదే సమయంలో బిజినెస్ లో లాభాలను 20 శాతం నుంచి 33 శాతానికి పెంచుకున్నాడు. అలాగే సంస్థ అకౌంట్ నుంచి డబ్బులను భారీ మొత్తంలో తన ఖాతాకు మళ్లించుకున్నాడు.
అలా మొత్తంగా సుమారు రూ.4.3 కోట్లకు పాండ్యా బ్రదర్స్ కి టోపీ పెట్టాడు. విషయం గురించి బ్రదర్స్ ఇద్దరూ వైభవ్ ని గట్టిగా నిలదీశారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పరువు తీస్తానంటూ వైభవ్ బెదిరించినట్టు సమాచారం. దీంతో హార్దిక్, కృనాల్ ఇద్దరూ ముంబాయి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైభవ్ ను అరెస్ట్ చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
ముంబై జట్టులో తలనొప్పులకు తోడు, ఇవి కూడా తోడవడంతో హార్దిక్ పాండ్యా తలపట్టుకున్నాడని అంటున్నారు.
Related News
ఆంధ్రప్రదేశ్లో ఈ నెలలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని ఓ పోలీసు అధికారి సస్పెండయ్యాడు. బం...
Continue reading
నేటి కాలంలో అన్ని ఆన్లైన్ చెల్లింపులే అయ్యాయి. రోడ్డుపక్కన చిన్న చిన్న దుకాణాలు మొదలు మాల్స్ వరకు కూడా డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నాం. యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక చేత...
Continue reading
Rohit Sharma:ముంబై ఇండియన్స్ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ శుక్రవారం నాడు ఆడింది. లక్నో సూపర్ జెయింట్తో తమ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ముంబై ఈ మ్యాచ్ ఆడింది.
ఈ మ్యాచ్లో ముంబై ఓడిపో...
Continue reading
కొన్ని దొంగతనాలను చూస్తే వీళ్లేం దొంగలురా బాబు అనిపిస్తుంది. ఏ గ్రహం నుంచి వచ్చార్రా బాబు అనక మానరు. అలాంటి దొంగతనమే వెలుగుచూసింది హైదరాబాద్లో. ఓ చక్కటి ఫ్యామిలీలో.. భర్తను మిగిల...
Continue reading
మైదానంలో చిన్న వర్షం పడ్డ కూడా మైదానం తడిసి పోవడంతో ఆ రోజు జరగాల్సిన ఆటను ఆపేసి వాయిదా వేస్తుంటారు. అలాంటిది మూడు ట్యాంకర్ల నీరు మైదానంలో ఓకే చోట పోసినా ఇట్టే మాయమైపోయాయి.
ప్రపం...
Continue reading
తమిళనాడులోని తేన్ కాశి జిల్లాలో పశ్చిమ కనుమల వద్ద కొలువుదీరిన పుణ్యక్షేత్రం… కుర్తాళం.
ఇక్కడి జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. అయితే ఈ ప్రాంతంలో గత ఐదు రోజులుగా వి...
Continue reading
తాడ్వాయిమండలంలోని కాటాపూర్ 3వ అంగన్వాడి సెంటర్ టీచర్ రడం సుజాత హత్య పెద్ద సంచలనంగా మారింది.
అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ ఆదేశాల మేరకు పస్రా సీఐ శంకర...
Continue reading
తల్లిదండ్రులు చేసిన చిన్న చిన్న నిర్లక్ష్యపు పనుల వల్ల.. అభం శుభం తెలియని చిన్నారులు బలైపోతున్నారు. భార్యా భర్తల మధ్య గొడవలు జరిగినప్పుడల్లా.. పిల్లలపై ప్రతాపాలు చూపిస్తుంటారు. వార...
Continue reading
ఐపీఎల్ 2024 సీజన్లో టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీ (Virat Kohli). ఆరెంజ్ క్యాప్ రేసులో అందరికంటే ముందున్నాడు. ప్రస్తుతం 13 మ్యాచుల్లో 661 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో తన ఆర...
Continue reading
ఐపీఎల్-17లో కోల్కతా నైట్రైడర్స్కు ప్లేఆఫ్స్ బెర్తు ఖరారైంది. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇప్పుడు గుజరాత్ టైటా...
Continue reading
James Anderson : గత కొన్ని రోజులుగా టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాల మధ్య, ప్రపంచంలోని గొప్ప ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్ట్ క్రికెట్ కు...
Continue reading
సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు.
అయితే.....
Continue reading