మహిళలకు భారీ శుభవార్త అందించిన ప్రధాని మోడీ

www.mannamweb.com


బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రధాని మోడీ విడుదల చేశారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు భారీ గుడ్‌న్యూస్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేస్తామని కీలక హామీ ఇచ్చారు. పదేళ్లలో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయ సంఘాల్లో చేరారని అన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలు కావాలని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వీటితో పాటు పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ సబ్సిడీ గ్యాస్ అందిస్తామన్నారు. సూర్యఘర్ పథకం ద్వారా పేదలకు ఉచిత విద్యుత్ పేదల కోసం మరో 3 కోట్ల పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.