జాన్సన్ బేబీ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలు! ఓ మహిళ మృతితో సంచలనం – కంపెనీకి షాక్ ఇచ్చిన కోర్టు

Johnson & Johnson Baby Powder: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి గట్టి షాక్‌ తగిలింది. ఓ కుటుంబానికి 45 మిలియన్ డాలర్ల పరిహారం కట్టాలని కోర్టు ఆదేశించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ (Illinois)కి చెందిన ఓ మహిళ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీపై కేసు వేసింది. ఈ పౌడర్‌ కారణంగా క్యాన్సర్ సోకుతోందని తీవ్ర ఆరోపణలు చేశారామె. దాదాపు పదేళ్లుగా ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ పౌడర్‌లో క్యాన్సర్ కారక రసాయనాలున్నాయని ఆ మహిళ పోరాటం మొదలు పెట్టింది. పదేళ్ల తరవాత ఆమె కేసు గెలిచింది. ఈ మేరకు కోర్టు జాన్సన్ కంపెనీ పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఏం జరిగిందంటే..?

2020లో థెరిసా గ్రెసియా మృతి చెందింది. ఆమెకి mesothelioma అనే క్యాన్సర్ సోకింది. అప్పుడే ఆమె కుటుంబ సభ్యులు Johnson & Johnson, Kenvue సంస్థలపై కేసు వేశారు. ఈ సంస్థలు విక్రయిస్తున్న టాల్కమ్ పౌడర్‌లో asbestos (రాతినార) ఉందని ఆరోపించారు. ఈ పౌడర్‌లోని ఈ అవశేషాలే ఆమెకి క్యాన్సర్‌ సోకేలా చేశాయమని పిటిషన్‌లో పేర్కొన్నారు. Mesothelioma క్యాన్సర్‌ చాలా అరుదైందే అయినా ప్రాణాంతకం. ఊపిరితిత్తులు లేదా పొత్తికడుపులోని పొరల్లో ఈ కణాలు పెరుగుతాయి. రాతినార ఎక్కువగా శరీరానికి తాకినప్పుడో, ఆ దుమ్ముని పీల్చినప్పుడో ఈ క్యాన్సర్‌ సోకుతుంది. అయితే…ఆ పౌడర్‌లో ఈ asbestos ఉండడం వల్లే ఆమెకి క్యాన్సర్ సోకిందని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు థెరిసా మృతికి 70% మేర Kenvue సంస్థ కారణంగా మిగతా 30% మేర జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థే కారణమని స్పష్టం చేసింది. అయితే…జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ మాత్రం తాము తయారు చేస్తున్న టాల్కమ్ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలు ఏమీ లేవని వాదిస్తోంది. దాదాపు వందేళ్లుగా తమ ప్రొడక్ట్‌ని సరైన విధంగానే బ్రాండింగ్ చేసుకుంటున్నట్టు వివరించింది. అటు Kenvue సంస్థ గత నెలలోనే ఓ ప్రకటన చేసింది. టాల్కమ్ పౌడర్‌ని ఇకపై తయారు చేయమని వెల్లడించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *