రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం,US కాన్సుల్‌ జనరల్‌తో పవన్ కళ్యాణ్‌ భేటీ

www.mannamweb.com


Pawan kalyan: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందనీ, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని పవన్ కళ్యాణ్‌.. యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌కు వివరించారు. మంగళగిరిలో యూఎస్ ప్రతినిధి బృందంతో పవన్ భేటీ అయ్యారు.

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున పవన్‌ కళ్యాణ్‌కు అమెరికా కాన్సుల్ బృందం అభినందనలు తెలియచేసి జ్ఞాపిక అందచేశారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ గారి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్, ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు.

పవన్‌ కళ్యాణ్‌కు జ్ఞాపిక అందచేస్తున్న యూఎస్‌ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు అమెరికా రాయబార బృందంతో భేటీలో చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందనీ, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖమంత్రి వివరించారు.

రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందనీ, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖమంత్రి తెలిపారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్ళేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని కోరారు. పర్యావరణహితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.

అమెరికా కాన్సుల్ జనరల్‌కు పులిబొమ్మను బహుకరిస్తున్న పవన్ కళ్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ భేటీ అయ్యారు. యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ గారు మర్యాదపూర్వకంగా మంగళవారం భేటీ అయ్యారు.