తెలంగాణ, ఆంధ్రాలో తేలికపాటి జల్లులు.. 6 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్

www.mannamweb.com


Weather News : రానున్న మూడు రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

మరికొన్ని రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. మరో మూడు రోజులు కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దిల్లీలో కూడా భారీ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈరోజు దాదాపు ఆరు రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

దిల్లీలో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, ఆగస్టు 8, ఆగస్టు 9 తేదీలలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారీ వర్షపాతం హెచ్చరిక లేదు. నోయిడాతో సహా దేశ రాజధాని ప్రాంతంలో ఆగస్టు 10 నుండి ఆగస్టు 12 వరకు ఎల్లో అలర్ట్‌లో ఉంటుంది. పగటిపూట గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రత వరుసగా 33 మరియు 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో ఉండవచ్చని అంచనా.

ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆగస్టు 10న హిమాచల్ ప్రదేశ్‌లో, ఆగస్టు 8న ఉత్తరాఖండ్‌లో అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఆగస్టు 10, 11 తేదీలలో జమ్మూ, కాశ్మీర్‌లో.., ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో ఆగస్టు 13 వరకు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఆగస్టు 11 వరకు, పంజాబ్‌లో ఆగస్టు 10, హర్యానాలో ఆగస్టు 8, ఆగస్టు 10 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.

ఈ వారంలో గోవా, గుజరాత్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం చాలా ఉంటుంది. ఆగస్టు 14 వరకు మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, సౌరాష్ట్ర, కచ్‌లలో చాలా వానలు ఉంటాయి.

ఆగస్టు 8, 9 తేదీలలో అస్సాం, మేఘాలయా, ఆగస్టు 8న పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఆగస్టు 9న అరుణాచల్ ప్రదేశ్, బీహార్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.

ఇక ఆగస్టు 8న కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త ధర్మరాజు తెలిపారు. ఉత్తర తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా తర్వాత వర్షాలు కురవనున్నాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ రానున్న మూడు రోజులు వానలు పడనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.