వాహనదారులకు ఇక నుంచి అలాంటి టెన్షన్‌ ఉండదు.. కొత్త నిబంధనలు

www.mannamweb.com


చాలా మంది వాహన యజమానులు తమ ఫాస్టాగ్ వాలెట్‌ని రీఛార్జ్ చేయడం మర్చిపోతుంటారు. దీనివల్ల టోల్ వద్ద రెట్టింపు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. కానీ, ఇప్పుడు అలాంటి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు.

కానీ, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఈ సమస్యను పరిష్కరించింది. ఫాస్టాగ్ బ్యాలెన్స్ నిర్దేశిత పరిమితి కంటే తక్కువగా ఉన్న వెంటనే ఖాతాదారుడి బ్యాంక్ ఖాతా నుండి వాలెట్‌కు డబ్బు ఆటోమేటిక్‌గా యాడ్‌ అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్, ఎన్‌సిఎంసిని ఇ-మాండేట్ ఫ్రేమ్‌వర్క్‌లో చేర్చడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ రెండింటినీ ఇ-మాండేట్ ఫ్రేమ్‌వర్క్‌లో చేర్చినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గురువారం ప్రకటించింది. అంటే ఇప్పుడు ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ యూజర్లు ఈ రెండు పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పదే పదే డబ్బు పెట్టే ఇబ్బంది నుండి బయటపడతారు.

ఫాస్టాగ్, ఎన్‌సిఎంసి కింద చెల్లింపులకు నిర్ణీత సమయం లేదని ఆర్‌బిఐ తన పత్రికా ప్రకటనలో తెలిపింది. ఏ సమయంలోనైనా చెల్లింపు అవసరం కావచ్చు. అందుకే ఎటువంటి నిర్ణీత సమయ పరిమితి లేకుండా ఖాతా నుండి డబ్బు జమ చేయబడుతుంది. ఈ చెల్లింపు సాధనాల్లోని బ్యాలెన్స్ సెట్ పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పుడు, కస్టమర్ ఖాతా నుండి డబ్బు ఆటోమేటిక్‌గా తీసివేసి ఈ వాలెట్‌లకు జోడిస్తుంది. దీని కోసం, వినియోగదారు మళ్లీ మళ్లీ మాన్యువల్‌గా డబ్బును జోడించాల్సిన అవసరం ఉండదు.

చెల్లింపు కోసం ఎలక్ట్రానిక్ ఆమోదం, ప్రస్తుతం రోజువారీ, వార, నెలవారీ మొదలైన సౌకర్యాల కోసం నిర్ణీత సమయంలో కస్టమర్ ఖాతా నుండి చెల్లింపు స్వయంచాలకంగా చేయబడుతుంది. ఈ మెకానిజం కోసం వినియోగదారు ఇ-మాండేట్ ద్వారా డబ్బును ఒకసారి డెబిట్ చేయడానికి అనుమతి ఇవ్వాలి.