మారుతి సుజుకీ నుంచి 5 కొత్త కార్లు.. చౌకైన ధరల్లో.. సరికొత్త డిజైన్‌.

www.mannamweb.com


సహజంగానే మారుతి కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ఎందుకంటే వాటి మైలేజీ కారణంగా డిమాండ్‌ పెరుగుతుందనే చెప్పాలి. ఇప్పుడు కంపెనీ తన కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి ఐదు కొత్త మోడళ్లపై దృష్టి సారించింది.

వీటి ధర రూ. 10 లక్షల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. రాబోయే కార్ల జాబితాలో అప్‌డేట్‌ చేసిన ఫ్రంట్‌లు, కొత్త తరం డిజైర్, కొత్త తరం బాలెనో, కొత్త మైక్రో SUV మరియు కొత్త కాంపాక్ట్ MPV ఉన్నాయి. ఈ కొత్త వాహనాల ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం..

కొత్త మారుతి డిజైర్:

కొత్త డిజైర్ విక్రయం మరికొద్ది నెలల్లో ప్రారంభమవుతుంది. దీనికి మెరుగైన డిజైన్, ఇంటీరియల్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ సెడాన్ 1.2 లీటర్, Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 82 bhp శక్తిని, 112 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక ఉంటుంది. ఇది కాకుండా ఈ కారు CNG ఇంధన ఎంపికతో కూడా వస్తుంది.

మారుతి ఫ్రంట్ ఫేస్ లిఫ్ట్:

ఫ్రంట్ ఫేస్‌లిఫ్ట్ 2025 సంవత్సరంలోప్రారంభమవుతుంది. ఇది కొత్త హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. కారు డిజైన్, ఇంటీరియర్‌లో స్వల్ప మార్పులు చేయవచ్చు.

కొత్త మారుతి కాంపాక్ట్ ఎంపీవీ:

మారుతి సుజుకి కొత్త కాంపాక్ట్ ఎమ్‌పివిని విడుదల చేయబోతోంది. ఇది 2026 నాటికి విడుదల కానుంది. దీనికి YDB అనే కోడ్‌నేమ్ ఇవ్వబడింది. ఇందులో మూడు వరుసల సీటింగ్ ఏర్పాటు ఉంటుంది. ఈ కారు కంపెనీ లైనప్‌లో ఎర్టిగా, XL6 కంటే తక్కువగా ఉంటుంది. దీనిని 1.2 లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో అందించవచ్చు. ఈ ఇంజన్ కొత్త స్విఫ్ట్‌లో కూడా అందుబాటులో ఉంది.

మారుతి కొత్త మైక్రో ఎస్‌యూవీ:

మారుతి సుజుకి లైనప్‌లో కొత్త మైక్రో ఎస్‌యూవీ కూడా జోడించనుంది. దీనికి Y43 అనే కోడ్‌నేమ్ ఇచ్చింది కంపెనీ. ఈ ఎంట్రీ లెవల్ SUV 2026, 27 మధ్య భారత మార్కెట్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభించిన తర్వాత, ఇది టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్సెటర్ వంటి కార్లతో పోటీపడుతుంది.

కొత్త తరం బొలెరో:

కొత్త తరం మారుతి బాలెనో ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. బలమైన హైబ్రిడ్ సిస్టమ్‌తో వచ్చే కంపెనీకి చెందిన కార్లలో ఇది చేర్చబడుతుంది. 2026 నాటికి కొత్త బాలెనో భారత మార్కెట్లోకి విడుదల కానుందని భావిస్తున్నారు.