వాలంటీర్లే లేరు – జగనే క్లోజ్ చేశారు !

www.mannamweb.com


వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు ఏపీలో ఉందా అంటే లేదు. జగన్ రెడ్డి హయాంలోనే తీసేశారు. ఆయన హయాంలోనే వాలంటీర్ల గడువు ముగిసింది. పొడిగింపునకు ప్రత్యేక జీవో జారీ చేయలేదు.

దీంతో వారి సర్వీసులు ముగిసిపోయినట్లయింది. రాజీనామాల పేరుతో వారితో ఎన్నికల సమయంలో నాటకం ఆడించారు. గత ఏడాది ఆగస్టులో వాలంటీర్లను నియమించుకున్నప్పుడు చేసుకున్న ఒప్పందం పూర్తయిపోయింది. కొనసాగిస్తేనే జీతాలివ్వగలమని అధికారులు చెప్పినా … జగన్ రెడ్డి పట్టించుకోలేదు. వాలంటీర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి ఆ ఒప్పందం కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదు. అంటే గత ఏడాది ఆగస్టుతోనే వాలంటీర్ల వ్యవస్థ మూతబడిపోయింది.

వాలంటీర్లు అంతా తమ పార్టీ వారేనని వైసీపీ నేతలు చెప్పుకుంటారు. అంతే కాదు వారందర్నీ జగన్ రెడ్డి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో ఓటర్లను బెదిరించడానికి కూడా ఉపయోగించుకున్నారు. ఇక సాధారణ ఎన్నికల సమయంలో చెప్పాల్సిన పని లేదు. ఐదేళ్ల పాటు ప్రజాధనం రూ. ఐదు వేలు ఇచ్చి… వారితోనే తన సాక్షి పత్రికకు వందల కోట్లు దోచి పెట్టుకుని ఎంత అరాచకం చేయాలో అంత చేశారు. కానీ వారి భవిష్యత్ కు గ్యారంటీ ఇవ్వలేకపోయారు. రాజకీయ చాన్సులిస్తానని.. అదనీ..ఇదనీ అదరగొట్టారు కానీ.. వారి కుటుంబాలకు భరోసా ఇవ్వలేకపోయారు. చివరికి ప్రభుత్వం మారితే సమస్యలు వస్తాయని తెలిసినా.. వారికి పొడిగింపు జీవోలు కూడా ఇవ్వలేదు.

వాలంటీర్లకు ఎలాంటి అవకాశాలు కల్పించాలన్నదానిపై ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తోంది. మొత్తం రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వైసీపీ కోసం రాజీనామాలు చేసి ఆ పార్టీ కోసం పని చేసిన వారి సంఖ్య లక్ష వరకూ ఉంటుంది. మిగిలిన వారు రాజీనామాలకు నిరాకరించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుండి వారికేమీ పనులు చెప్పడం లేదు. అందుకే జీతాలు రావడం లేదు. చాలా మంది వాలంటీర్లు తమకు చేతనైన పనులు చేసుకుంటున్నారు. రాజీనామాలు చేయని వారికి మూడు నెలల జీతాలు ఇచ్చే ప్రతిపాదన కేబినెట్ లో చర్చించినప్పటికీ.. వారి సేవలు పొడిగింపుపై ఉత్తర్వులు లేనందున ఏ ఖాతాలో ఇచ్చినా అది చట్టవిరుద్ధమే కాబట్టి.. ఏ చేయాలన్నదానిపై పరిశీలన చేయలని నిర్ణయించారు.

జగన్ రెడ్డి తనను నమ్ముకున్న వాళ్లందర్నీ ముంచారు. చివరికి వాలంటీర్లను కూడా. అంతిమంగా ఆయన స్వార్థం చేసుకున్నారు.. తన కోసం పని చేసిన వారందర్నీ డ్రైనేజీలో కలిపేస్తున్నారు