జానీ మాస్టర్ భార్యపై మరో కేసు.. అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు! కారణమిదే

www.mannamweb.com


ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు, అలానే అత్యాచారం చేసినట్లు ఒక లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్ కు తీసుకొచ్చి, కోర్టులో హాజర పరిచారు. ఈ క్రమంలోనే కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో జానీని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా ఇదే విషయంలో జానీ మాస్టర్ భార్య అయేషాపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. మతం మారి తన భర్తను పెళ్లిచేసుకోవాలని, అయేషా వేధించేదని, పలు మార్లు దాడి కూడా చేసిందని సదరు యువతి అయేషాపై కేసు పెట్టింది. తాజాగా మరో విషయంలో జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అయేషా తాజాగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని సమాచారం. ఈ కారణంతోనే అయేషాపై మరో కేసు నమోదయ్యిందని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయేషాతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

కాగా లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేయనున్నారని టాక్. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణల నేపథ్యంలో అయేషా చేస్తోన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ’16 ఏళ్ల వయసులో రేప్ చేశాడని ఆ అమ్మాయి అంటుంది. దీనికి తగిన ఆధారాలు చూపాలని అయేషా డిమాండ్ చేస్తోంది. కావాలనే తన భర్తను ఇరికిస్తున్నారంటోంది. ఇది తప్పుడు కేసు అని, జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవల్ లో ఫేమస్ అయ్యాడని, అందుకే కొందరు ఓర్వలేకనే ఆయనను తొక్కేస్తున్నారంటూ అయేషా ఆరోపిస్తోంది.