గురివింద వెనుక ఇంత కహానీ ఉందా.? బంగారాన్ని తూచేందుకు ఎందుకు ఉపయోగించేవారు

www.mannamweb.com


గురివింద గింజ పేరు వినగానే మొదటగా గుర్తొచ్చే.. ‘గురివింద గింజ తన నలుపెరగదంట’ అనే ఈ సామెత గుర్తు రావడం సర్వసాధారణం. గురివింద పై భాగం మొత్తం ఎర్రగా ఉండి కింది భాగంలో మాత్రం నల్లగా ఉంటుంది.

కానీ, ఆ నలుపు సంగతి ఎరుగక అది తనని తాను ఓ గొప్ప అందగత్తె నని భ్రమపడుతుంది. మనుషులు కూడా తమలోని తప్పులను తెలుసుకోలే ఇతరులను తప్పు పడతారన్న అర్థం వచ్చేలా ఈ సామెతను ఉపయోగిస్తారు.

అయితే గురివింద గింజల వెనకాల ఎంతో పెద్ద కథ ఉందని మీకు తెలుసా.? సాధారణంగా ఈ గింజలను బంగారాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తుండం చూసే ఉంటాం. మరి ఈ గింజలను బంగారం బరువు కొలిచేందుకు ఎందుకు ఉపయోగిస్తారు.? అసలు ఈ గింజలు ఏ మొక్క నుంచి వస్తాయి.? లాంటి ఆసక్తికర విషయాలను ఓ నెటిజన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలో వివరంగా తెలిపారు..

ఈ గింజలు గూంజ్‌ మొక్క నుంచి వస్తాయి. దీనిని సాధారణంగా రోసరీ బఠానీ అని కూడా పిలుస్తుంటారు. ఏడాది పొడవునా ఈ మొక్కలు విస్తృతంగా పెరుగుతుంటాయి. గురివింద గింజలను మొదట్లో బంగారాన్ని కొలిచేందుకు ఉపయోగించేవారు. దీనికి కారణం ఈ గింజలన్నీ దాదాపు ఒకే బరువలో ఉంటాయి. అందుకే వీటిని ప్రామాణికంగా తీసుకుంటారు. దేశంలో తొలిసారి బంగారం, వెండిని కొలిచేందుకు ఈ గింజలే ఉపయోగించేవారు. త్రాసులో ఒకవైపు గింజలు వేసి మరో వైపు బంగారాన్ని మెజర్ చేసేవారు.