రైల్వే ట్రాక్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయం ఏంటో తెలుసా

www.mannamweb.com


ఇండియన్‌ రైల్వే.. ఇది దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రతి రోజు రైళ్ల ద్వారా లక్షలాది మంది ప్రయాణాలు కొనసాగదిస్తుంటారు. అయితే రైల్వే గురించి ఎన్నో ఆసక్తికర అంశాలు ఉంటాయి.

ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం చేసే ఉంటారు. కానీ మనకు ఆసక్తికరంగా ఉండే అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని ఎవ్వరు కూడా పెద్దగా పట్టించుకోరు.

రైల్వే స్టేషన్‌కు వెళితే రైలు పట్టాలను చూసే ఉంటారు. ఈ రైలు పట్టాలపై కొన్ని విషయాలు దాగి ఉంటాయి. వాటిని తెలుసుకోవడం కూడా ముఖ్యమే. రైలు పట్టాల మధ్య కంకర వేసి ఉండటం అందరు చూసే ఉంటారు. ఇలా పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు వేస్తారోనని మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా?

అంతేకాదు.. రైలు పట్టాల మధ్యనే కాకుండా దాని చుట్టూ ఈ కంకర రాళ్లను వేసిన దృశ్యాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ అవి ఎందుకు వేశారో అనే విషయం చాలా మందికి తెలియదు. వాటి గురించి పెద్దగా పట్టించుకోం కూడా. మరీ కంకర రాళ్లను ఎందుకు వేస్తారో తెలుసుకుందాం.

రైలు పట్టాలు వేసే ముందు ప్రత్యేక దిమ్మెలను భూమిపై పర్చి వాటిపై రైలు పట్టాలను అమర్చుతారు. అయితే గతంలో చెక్కతో చేసిన దిమ్మెలు ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ప్రత్యేక కాంక్రిట్‌తో తయారు చేసిన దిమ్మెలను వేస్తున్నారు. తర్వాత పట్టాల మధ్యలో, చుట్టుపక్కల కంకర రాళ్లను వేస్తారు. కంకర రాళ్ల వల్ల పట్టాల కింద ఉండే దిమ్మెలు కదలకుండా ఉంటాయి. పట్టాలపై రైలు ప్రయాణించినప్పుడు కంకర రాళ్ల వల్ల పట్టాలు ఎటు కదలకుండా దిమ్మెలు ఫిక్సై ఉంటాయి. రైలు వెళ్తున్నప్పుడు ప్రమాదం ఉండదు. అంతేకాకుండా వర్షం పడినప్పుడు కంకర ఉండటం వల్ల నీరు సులభంగా భూమిలోకి ఇంకిపోతుంది.

ఇలా రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు వేయడం వల్ల ఎంత వర్షం వచ్చినా కంకర కొట్టుకుపోదు. పైగా నీళ్లు సులభంగా ఇంకిపోతాయి. దీంతో రైళ్లకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు. మరో విషయం ఏంటంటే సాధారణంగా భూమిపై చిన్న చిన్న మొక్కలు, ముళ్లపొదలు పెరుగుతుంటాయి. కానీ రైలు పట్టాల మధ్య కంకర ఉండటం వల్ల పిచ్చి మొక్కలు, పొదళ్లు లాంటివి ఏమి పెరగవు. కంకర లేకపోతే పిచ్చి మొక్కలు పెరిగి రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది. సో..రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు వేయడానికి కారణాలు ఇవే.