జియో ల్యాప్‌టాప్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ. 12 వేలకే సొంతం చేసుకోవచ్చు

www.mannamweb.com


తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో జియో 2023లో జియోబుక్‌ 11 పేరుతో ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. అయితే తాజాగా యూజర్ల కోసం ల్యాప్‌టాప్‌పై మంచి డిస్కౌంట్‌ను అందిస్తోంది.

ఆఫర్‌లో భాగంగా ఈ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ. 12,890కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ లభించనుంది. అమెజాన్‌ఓ పాటు రిలయన్స్‌ డిజిటల్‌లో ఈ ల్యాప్‌టాప్‌ అందుబాటులో ఉంది.

ఫీచర్ల విషయానికొస్తే ఈ ల్యాప్‌టాప్‌ 4జీ మొబైల్‌ నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. లేదా వైఫైకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. జియో ఓస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ల్యాప్‌టాప్‌ పనిచేస్తుంది. ఇందులో 11.6 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు.

ఈ ల్యాప్‌టాప్‌ బరువు కేవలం 990 గ్రాములు మాత్రమే కావడం విశేషం. ఇక జియోబుక్‌ 11 కేవలం బ్లూ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 8 గంటలు పనిచేస్తుంది.

కాగా జియో ఈ ల్యాప్‌టాప్‌పై 12 నెలల వారంటీ అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, వాట్సాప్‌తో సహా మరెన్నో అప్లికేషన్‌లకు సపోర్ట్ చేస్తుంది. వెబ్‌క్యామ్, స్టీరియో స్పీకర్ల సహాయంతో వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేసిన వారికి 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది.